యాప్నగరం

139 కాలేజీలకు హైకోర్టు షోకాజ్ నోటీసులు

జీతాలు చెల్లించకుండా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు హక్కులకు విరుద్ధంగా కాలేజీలు వ్యవహరిస్తున్నాయని పిటీషిన్‌లో ఆరోపించారు.

Samayam Telugu 29 Sep 2020, 7:50 am
రాష్ట్రంలో ఉన్న పలు కాలేజీలకు నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. 139 కాలేజీలకు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసింది. కాలేజీ యాజమాన్యాలు జీతాలు చెల్లించడం లేదని హైకోర్టు లో పిటిషన్ దాఖలు అయ్యింది. బాలకృష్ణా రెడ్డి అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. లాక్ డౌన్ సమయంలో జీతాలు చెల్లించలేదని కోర్టుకు పిటీషనర్ తెలిపారు. ఆర్టికల్ 226 హక్కులను కాలేజీలు కాలరాస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.
Samayam Telugu తెలంగాణ హైకోర్టు
ts high court


తెలంగాణ ఎడ్యుకేషనల్ ఆక్ట్ 1982, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 21, 23 కింద పొందుపరచబడిన హక్కులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం జీతాలు చెల్లించని కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే కాలేజీలు, స్కూళ్లు బంద్ అయిన విషయం తెలిసిందే. దీంతో పలు కాలేజీల యాజమాన్యాలు పిల్లలకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.