నిన్నమొన్నటి వరకు వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. పలుచోట్ల భారీగా వర్షం కురవడంతో ఎండవేడికి అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందరు. అయితే తాజాగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రేపు, ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. సాధారణం కన్నా2 – 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరట్వాడా, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది.
తెలంగాణ వాసులు జాగ్రత్త.. రానున్న రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయి. మళ్లీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Samayam Telugu 17 Apr 2021, 2:37 pm
ప్రధానాంశాలు:
- వర్షాలతో చల్లబడిన వాతావరణం
- ఇప్పుడు మళ్లీ మండనున్న ఎండలు
- సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికం