యాప్నగరం

వైద్యులపై దాడి వ్యవహారం హైకోర్టుకు.. సీఎస్, డీజీపీకి ప్రత్యేక ఆదేశాలు

Coronavirus Updates in Telangana: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం ఐసోలేషన్ వార్డులోని కరోనా రోగులు అక్కడ వారికి చికిత్స అందిస్తున్న వైద్యులపై దాడికి దిగారు.

Samayam Telugu 9 Apr 2020, 3:29 pm
గాంధీ ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం వైద్యులపై కరోనా రోగుల దాడి వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఓ న్యాయవాది ఈ మేరకు హైకోర్టుకు లేఖ రాయగా.. దాన్ని అత్యవసర ప్రజాప్రయోజన వ్యాజ్యంగా కోర్టు స్వీకరించింది. వైద్య సిబ్బంది రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఉన్నతాధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఈ నెల 16లోగా వైద్యుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను హైకోర్టు ఆదేశించింది.
Samayam Telugu telangana high court


సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం ఐసోలేషన్ వార్డులోని కరోనా రోగులు అక్కడ వారికి చికిత్స అందిస్తున్న వైద్యులపై దాడికి దిగారు. ఓ కరోనా రోగి చనిపోవడంతో అతని మృత దేహాన్ని కుటుంబానికి అప్పగించాలని కరోనా రోగులైన బంధువులు డిమాండ్ చేశారు. అందుకు వైద్యులు ఒప్పుకోకపోవడంతో వారు వైద్యులపై దాడికి దిగారు. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దాడికి పాల్పడ్డ కరోనా రోగులను అరెస్టు చేసి, వారిని ఛాతీ ఆస్పత్రిలోని వార్డుకు తరలించారు.

Must Read: కండోమ్‌ల కొరత కలవరం.. లాక్‌డౌన్‌ వేళ విపరీత గిరాకీ, యూఎన్ సైతం ఆందోళన

అంతేకాక, వైద్యులపై దాడి ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఐసోలేషన్ వార్డులు ఉన్న అంతస్తులు సహా ప్రధాన ద్వారం వద్ద పోలీసులను మొహరించారు. ఇక్కడి భద్రతను హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ సౌత్ జోన్ డీసీపీకి అప్పగించారు. దాదాపు 200 మంది పోలీసులు ప్రస్తుతం భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Also Read: చిక్కుల్లోకి ఎంపీ అర్వింద్‌.. పదవికే ఎసరు పెట్టేలా పక్కా వ్యూహం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.