యాప్నగరం

దత్తాత్రేయకు గుండెపోటు అపోలోకు తరలింపు

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు అస్వస్థతకు గురయ్యారు. గుండె నొప్పి రావడంతో ఆయన అపోలో ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 9 Mar 2020, 12:17 pm
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదర్‌గూడా అపోలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ రావాల్సి ఉంది. బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.
Samayam Telugu bandaru


బండారు దత్తాత్రేయ అంటే...చాలామంది రాజకీయ నేతలకు ఎంతో గౌరవం. ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ... ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దత్తాత్రేయ. పాలిటిక్స్‌లో కీ రోల్ ప్లే చేస్తున్న వివాదాలకు మాత్రం ఆయన ఎప్పుడూ దూరమే. అందుకే గతంలో బీజేపీ ఆయనకు రెండు సార్లు కేంద్ర మంత్రి పదవిని కూడా ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా గతంలో నియమించింది. వాజపేయి హయంలో కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రిగా బండారు దత్తత్రేయ పనిచేశారు. నరేంద్ర మోడి ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా పార్టీ పట్ల ఆయనకున్న వినయ, విధేయతను గుర్తించి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బండారును బీజేపీ అధిష్టానం నియమించింది. బండారు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న పలువురు పార్టీ నేతలు, ఇతర రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.