యాప్నగరం

తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్: హోమ్ మంత్రి

Hyderabad: శిక్షణ పూర్తి చేసుకున్న 450 మంది కానిస్టేబుళ్లకు మంత్రి మహమూద్ అలీ అభినందనలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని మంత్రి మహమూద్ అలీ వారికి సూచించారు.

Samayam Telugu 7 Oct 2020, 4:36 pm
తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ ‘‘సీఎం కేసీఆర్ పోలీస్ శాఖను మరింత బలోపేతం చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో లాక్ డౌన్ విధించినప్పుడు పోలీసులు వారి కర్తవ్యాన్ని ఎంతో జాగ్రత్తగా విధులు నిర్వహించారని గుర్తు చేశారు.
Samayam Telugu కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ
Home minister mahmood ali


ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 450 మంది కానిస్టేబుళ్లకు మంత్రి మహమూద్ అలీ అభినందనలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని మంత్రి మహమూద్ అలీ వారికి సూచించారు. చక్కగా విధులు నిర్వర్తించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.