యాప్నగరం

పోలీసులు మంచి పని చేశారు.. హోం మంత్రి అభినందనలు

Chandrayangutta: చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా వర్షంలో తడుస్తూ ఓ దుకాణం వద్ద పడిపోయిన వ్యక్తి గురించి సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి ఆయనను రక్షించారు.

Samayam Telugu 16 Jul 2020, 6:29 pm
కరోనా కట్టడిలో మాత్రమే మానవత్వం చూపడం కాదు మామూలు రోజుల్లో కూడా పోలీస్ శాఖ మంచితనాన్ని నిరూపించుకుంది. హైదరాబాదులో మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి తడుస్తూ బయట షాపు వద్ద పడుకుంటున్న ఒక వ్యక్తిని పోలీసులు రక్షించారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పోలీసులను ప్రశంసించారు. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా వర్షంలో తడుస్తూ ఓ దుకాణం వద్ద పడిపోయిన వ్యక్తి గురించి సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి ఆయనను రక్షించారు.
Samayam Telugu మహమూద్ అలీ
mahmood ali


ఆ వ్యక్తి తన వివరాలేమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌కు చెందిన బి.మహేష్ అనే కానిస్టేబుల్, ఎం. డి సయీద్ అనే హోం గార్డ్‌లు ఆ వ్యక్తిని రక్షించేందుకు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. లేవలేని స్థితిలో ఉన్న అతణ్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివరాల కోసం ప్రయత్నించగా తన పేరు శేఖర్ అని చెప్పగలిగాడని పోలీస్ సిబ్బంది తెలిపారు. పోలీసు సిబ్బంది శాంతిభద్రతలను కాపాడడంతో పాటు ఈ రకమైన సేవ చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.