యాప్నగరం

తెలంగాణలో మరో పరువు హత్య.. కూతుర్ని ప్రేమించాడని

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేష్ ఇవాళ ఉదయం ప్రాణాలు వదిలాడు.

Samayam Telugu 3 Dec 2020, 10:28 am
తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. ప్రణయ్, హేమంత్ తర్వాత మరో యువకుడు ప్రేమించిన పాపానికి బలి అయ్యాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నందిపేట మండలం కౌల్ పూర్ గ్రామం ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తమ కూతురిని ప్రేమించాడని అమ్మాయి తరుపు బంధువుల మహేష్ అనే యువకుడి పై దాడికి దిగారు. దీంతో గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు.
Samayam Telugu తెలంగాణలో పరువు హత్య
honor killing


Read More:నీ మనసులో ఎవరో ఉన్నారంటూ వేధింపులు.. వివాహిత షాకింగ్ నిర్ణయం

వివారల్లోకి వెళ్తే.. మహేష్.. వరుసకు బంధువుల అమ్మాయినే ప్రేమించాడు. ఈ విషయం కాస్త అమ్మాయి తరపు బంధువులకు తెలిసింది. దీంతో అబ్బాయి పై అమ్మాయి తరుపు కుటుంబ సభ్యులు దాడికి దిగారు. ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్‌కు పిలిచి అంతా కలిసి దాడికి దిగార. ఈ దాడిలో మహేష్ చేయికూడా విరిగింది. అయితే బలమైన గాయాలు కావడంతో రక్తం గడ్డకట్టి మహేష్ ఇవాళ ఉదయం మరణించాడు. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మహేష్ మృతి చెందడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read More: తెలంగాణవాసులకు షాక్.. ఆధార్ ఉంటేనే రేషన్

మహేష్ ను అమ్మాయి తరుపు బందువులు కొట్టడంతో మృతి చెందాడని మృతుడి తల్లి ఆరోపిస్తోంది. తీవ్రంగా కొట్టి తన కొడుకు ప్రాణాలు తీశారని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మూడేళ్ల క్రితేమ కౌల్‌పూర్ గ్రామానికి వచ్చామని పేర్కొంది. తన భర్త కూడా ఊరికి రాగానే చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన కొడుకు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మహేష్ తల్లి డిమాండ్ చేస్తోంది. మహేష్ మృతికి కారణమైన అమ్మాయి తరపు బంధువులను అరెస్టు చేయాలని మహేష్ బంధువులంతా డిమాండ్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.