యాప్నగరం

కరోనా అనుమానం.. బైక్ తగలబెట్టిన ఇంటి ఓనర్

Aswaraopeta: తన ఇంటి ముందుకు ఎందుకు బైక్ పెట్టావని గొడవకు దిగాడు. తర్వాత అదే వాహనంలోని పెట్రోల్‌ తీసి తగలబెట్టాడు. ఈ వ్యవహారంపై బాధితుడు అశ్వారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Samayam Telugu 14 Jul 2020, 11:29 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కరోనా వచ్చిందే అన్న అనుమానంతో ఓ ఇంటి యజమాని తీవ్రమైన అత్యుత్సాహం ప్రదర్శించాడు. స్థానిక డ్రైవర్ కాలనీలో నివాసం ఉండే ఓ వ్యక్తికి కరోనా సోకిందన్న అనుమానంతో తన ఇంటి ముందు నిలిపిన ద్విచక్రవాహనాన్ని యజమాని తగలబెట్టాడు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లికి చెందిన ఓ యువకుడు మంగళవారం అశ్వారావుపేటలోని బంధువుల ఇంటికి వచ్చాడు. బంధువుల ఇంటికి దగ్గర్లోనే ఉన్న మరో ఇంటి ముందు తన బైక్‌ను నిలిపాడు. దీంతో ఆ ఇంటి యజమాని ఆగ్రహంతో ఊగిపోయాడు. నీకు కరోనా ఉందంటూ వాదనకు దిగాడు. అతని ప్రాంతంలో వైరస్ తీవ్రత బాగా ఉందని ఇక్కడి ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Aswaraopet


తన ఇంటి ముందుకు ఎందుకు బైక్ పెట్టావని గొడవకు దిగాడు. తర్వాత అదే వాహనంలోని పెట్రోల్‌ తీసి తగలబెట్టాడు. ఈ వ్యవహారంపై బాధితుడు అశ్వారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ద్విచక్రవాహనాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇంటి యజమానే అతిగా, దురుసుగా ప్రవర్తించాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.

Must Read: గాంధీలో మరో ఘోరం.. 8గంటలు అక్కడే కరోనా శవం? వార్డులో దుర్వాసన

Must Read: నిజాం రహస్య నిధుల కోసమే సచివాలయం కూల్చివేత.. రేవంత్ సంచలన ఆరోపణలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.