యాప్నగరం

ప్రసవం కోసం 6 ఆస్పత్రులు, 200కి.మీ.. గర్భిణీ, శిశువు మృతి; కంటతడి పెట్టించే ఘటన

Jogulamba Gadwal: తన భార్యకు సకాలంలో కాన్పు చేసి ఉంటే బతికి ఉండేదని, గద్వాల జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు ఇలా ఆస్పత్రులకు తమను తిప్పారని మహిళ భర్త మహేందర్‌ వాపోయారు. భార్య, పుట్టబోయే బిడ్డలను పోగొట్టుకున్న తాను ఈ శోకాన్ని ఎలా భరించాలని ఆవేదన వ్యక్తం చేశాడు.

Samayam Telugu 29 Apr 2020, 8:27 am
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన నెలలు నిండిన ఓ గర్భిణీ ప్రసవం కోసం 6 ఆస్పత్రులు తిరిగి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు చివరకు శిశువు కూడా చనిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం యాపదిన్నెకు చెందిన జెనీలా అనే మహిళ కాన్పు కోసం ఆమె భర్త సుమారు 200 కిలో మీటర్లు తిప్పారు. అయితే, ఈ ఘటనపై మీడియాలో వెలువడ్డ కథనాలపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Samayam Telugu shrc


ఈ దయనీయ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలను హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఘటనపై జూన్‌ 16లోపు సమగ్ర నివేదిక అందించాలని పలువురు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మహబూబ్‌నగర్‌ డీహెచ్ అండ్ ఎంఓ, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెట్లకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: కరోనాపై రాహుల్ సిప్లిగంజ్ ఉర్రూతలూగించే పాట.. విడుదల చేసిన కేటీఆర్

తన భార్యకు సకాలంలో కాన్పు చేసి ఉంటే బతికి ఉండేదని, గద్వాల జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు ఇలా ఆస్పత్రులకు తమను తిప్పారని మహిళ భర్త మహేందర్‌ వాపోయారు. భార్య, పుట్టబోయే బిడ్డలను పోగొట్టుకున్న తాను ఈ శోకాన్ని ఎలా భరించాలని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను బతికుండి ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 24న జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి తొలుత ప్రసవం కోసం వెళ్లగా డాక్టర్లు నిరాకరించడంతో గర్భిణీ అక్కడి బెంచీపై పడుకొని అవస్థలు పడింది. ఈ దృశ్యం పలువురికి కంటతడి పెట్టించింది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.