యాప్నగరం

అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య... మనస్తాపంతో భర్త ఆత్మహత్య

తాగుడుకు అలవాటు పడ్డ భర్త నిత్యం తాగొచ్చి భార్యతొ గొడవ పడేవాడు. ఈ క్రమంలో తాగిన భర్త భార్యను కొట్టాడు. భర్త కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

Samayam Telugu 29 Sep 2020, 1:01 pm
భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లిందని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుది. గౌతంనగర్‌కు చెందిన సత్యనారాయణ, లక్ష్మి భార్యభర్తలు. 2017లో వీరిద్దరికీ వివాహం జరిగింది. వారికి యేడాదిన్నర బాబు ఉన్నాడు. మద్యానికి బానిసైన సత్యనారాయణ తాగి వచ్చి భార్యతో నిత్యం గొడవ పడేవాడు. ఈ నెల 26న లక్ష్మీతో గొడవ పడ్డ భర్త సత్యతనారాయణ ఆమెపై దాడి కూడా చేశాడు. భర్త తాగొచ్చి తనను కొట్టడంతో తీవ్ర ఆవేదనకు గురైన లక్ష్మీ బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.
Samayam Telugu భర్త ఆత్మహత్య
husband suicide


Read More: హైదరాబాద్‌లో సెలబ్రిటీలకు షాక్.. ప్రముఖుల వాట్సాప్ చాట్ హ్యాక్

ఎల్బీనగర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు భర్త ఫోన్‌ చేసి ఇక మీదట కొట్టను ఇంటికి వచ్చేయాలని బతిమిలాడాడు. లక్ష్మి సరే అని చెప్పింది. అయితే ఈలోపే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సత్యనారాయణ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం స్థానికులు గమనించి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.