యాప్నగరం

జగద్గిరిగుట్టలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో భర్త ఆగ్రహంతో భార్యను హత్య చేశాడు.

Samayam Telugu 5 Oct 2020, 11:28 am
చిన్న చిన్న కారణాలకే భార్యభర్తలు హత్యలు, ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు వివాహేతర సంబంధాలతో ఒకర్నొకరు చంపుకుంటుంటే.. మరికొందరు కుటుంబ కలహాలతో హత్యలు చేసుకుంటున్నారు. అనవసరంగా జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట లో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. జగద్గిరిగుట్ట పియస్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా మారత, కిషన్ దంపతులు నివసిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
Samayam Telugu భార్యను చంపిన భర్త
husband killed wife


Read More: భర్తను చంపి.. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భార్య

ఈ క్రమంలో భార్య మారతను (31 )ను భర్త కిషన్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అయితే కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఇవాళ తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. భర్తను అదుపులోకి తీసుకొని పోలీసుల విచారిస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు మృతురాలి కుటంబసభ్యులు మాత్రం భర్తపై ఆరోపణలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.