యాప్నగరం

Munugode Bypolls: 'కేసీఆర్ పిల్లిమొగ్గలేసినా మునుగోడులో గెలిచేది బీజేపీనే'

Munugode Bypolls: సీఎం కేసీఆర్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలుపెట్టిన నాలుగోవిడత ప్రజాసంగ్రామ యాత్ర నేపథ్యంలో కుత్బుల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కేసీఆర్ తలకిందులుగా జపం చేసినా మునుగోడులో గెలిచేది మాత్రం బీజేపీనే అని ఈటల జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై అసెంబ్లీ సాక్షిగా విమర్శలు చేయటం పట్ల తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేశారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 12 Sep 2022, 5:35 pm
Munugode Bypolls: సీఎం కేసీఆర్ (CM KCR) పిల్లిమొగ్గలేసినా మునుగోడు ఉపఎన్నిక (Munugode By Elections)లో గెలిచేది మాత్రం బీజేపీనేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Huzurabad MLA Eatala Rajender ) స్పష్టం చేశారు. కేసీఆర్ మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్న మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తారని జోస్యం చెప్పారు. హుజురాబాద్‌ (Huzurabad)లో ఇచ్చిన తీర్పునే మునుగోడు ప్రజలు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. తలకిందులుగా జపం చేసినా మునుగోడులో ఎగిరేది కాషాయ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు.
Samayam Telugu Etela rajender Comments
ఈటల రాజేందర్


నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP State President Bandi sanjay) చేపట్టిన నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలపై టీఆర్‌ఎస్ సర్కార్ మరింత భారం మోపిందని ఆరోపించారు. తన చేతకానితనాన్ని సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ గురించి కేసీఆర్ మాట్లాడే విధానం అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు. తనను సభకు రానివ్వకుండా చేయటం కాదు.. కేసీఆర్‌నే అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసే బాధ్యత తీసుకుంటానని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేయటం కోసం కార్యదీక్షలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం కార్యకర్తలంతా అకుంఠిత దీక్షతో పనిచేయాలని ఈటల సూచించారు.
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.