యాప్నగరం

మాదాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి చేతిలోని మేనల్లుడి మృతి

Hyderabad: రోడ్డు ప్రమాదంలో 14 నెలల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. బాలుడిని అతడి మేనమామ ఎత్తుకొని రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది.

Samayam Telugu 6 Jan 2020, 3:12 pm
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. 14 నెలల బాలుడిని అతడి మేనమామ ఎత్తుకొని రోడ్డు దాటుతుండగా.. ఓ వ్యక్తి స్కూటీపై వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టాడు. మేనమామ రాజ్‌కుమార్ చేతుల్లోంచి రోడ్డుపై ఎగిరిపడి ఆ బాలుడు సతీశ్ అక్కడికక్కడే మరణించాడు. మాదాపూర్‌లోని జయభేరి సిలికాన్ టవర్స్ వద్ద సోమవారం (జనవరి 6) మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రాజ్‌కుమార్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu Madhapur Accident


రాజ్‌కుమార్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అతడు తన మేనల్లుడుని ఎత్తుకొని రోడ్డు దాటుతుండగా మాదాపూర్ వైపు వేళ్తున్న స్కూటీ ఢీకొట్టింది. దీంతో రాజ్ కుమార్ చేతుల నుంచి చిన్నారి సతీశ్ (14 నెలలు) రోడ్డుపై ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: రక్తమోడుతూ బిడ్డకు పాలు.. కంటతడి పెట్టిస్తున్న కన్నతల్లి ప్రేమ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.