యాప్నగరం

హైదరాబాద్: ప్రేమ పెళ్లి చేసుకొని వేధింపులు.. ట్రైనీ ఐపీఎస్‌పై కేసు నమోదు

ట్రైనీ ఐపీఎస్‌పై కేసు నమోదు చేసిన హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీసులు. ఏడాది క్రితం మహేష్‌రెడ్డితో ప్రేమ వివాహం.. అదనపు కట్నం కోసం భర్త తనను వేధిస్తున్నాడన్న భార్య భావన.

Samayam Telugu 29 Oct 2019, 3:52 pm
ప్రేమ పెళ్లి చేసుకొని భార్యను వేధించిన కేసులో ట్రైనీ ఐపీఎస్‌పై కేసు నమోదయ్యింది. ఏడాదిగా తనతో కాపురం చేసిన భర్త.. ఇప్పుడు అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భార్య ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు చెబుతున్న వివరాల ప్రకారం.. భావనకు కడప జిల్లాకు చెందిన మహేష్‌ రెడ్డితో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకునే సమయంలో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. ఏడాది క్రితం వివాహం కూడా చేసుకున్నారు.
Samayam Telugu ips.


భార్యాభర్తలు ఇద్దరూ హైదరాబాద్‌లోనే ఈ జంట నివాసం ఉంటోంది. అయితే మహేష్ రెడ్డి ఐపీఎస్‌గా ఎంపికయ్యాడని.. అప్పటి నుంచి అతడిలో మార్పు వచ్చిందని భావన చెబుతోంది. అదనపు కట్నం కోసం భర్త తనను వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. అదనపు కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానంటూ భర్త కొద్ది రోజులుగా వేధిస్తున్నారని భావన చెబుతోంది.

భావన హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మహేష్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం స్వీకరించిన పోలీసులు.. మహేష్‌రెడ్డిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.