యాప్నగరం

అమ్మానాన్న కలిసుండాలని.. బీబీఏ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి..

తల్లిదండ్రులు కలిసుండాలని సూసైడ్ నోట్ రాసి బీబీఏ చదివే ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Samayam Telugu 4 Jul 2020, 2:42 pm
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కలిసుండాలని లేఖ రాసి బీబీఏ చదివే ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంజీవ్ రెడ్డి, హేమలత దంపతులకు ఆకాష్ రెడ్డి (20) అనే కొడుకు ఉంటున్నాడు. ఆకాష్ రెడ్డి ప్రస్తుతం బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) చదువుతున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్నారు.
Samayam Telugu విద్యార్థి ఆత్మహత్య


ఈ తరుణంలో ఆకాష్ రెడ్డి దీనిపై తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. ఈ తరుణంలో అమ్మ, నాన్నలు కలిసుండాలని సూసైడ్ నోట్ రాసి ఆకాష్ రెడ్డి (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన కుమారుడి మరణానికి భర్త సంజీవ్ రెడ్డితో పాటు బంధువులపై అనుమానం వ్యక్తం చేస్తూ తల్లి హేమలత నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.