యాప్నగరం

మరదలికి మత్తు మందిచ్చి ఫ్రెండ్‌తో కలిసి రేప్: Hyd కోర్టు సంచలన తీర్పు

Secunderabad: 2015 అక్టోబరు 16న రాత్రి తన మరదలిని ఇంటివద్ద దింపుతానంటూ బావ ఆటోలో తీసుకెళ్లాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చాడు. తర్వాత ఫ్రెండ్‌తో కలిసి రేప్ చేశాడు.

Samayam Telugu 27 Jun 2020, 11:20 pm
హైదరాబాద్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరదలికి మత్తుమందిచ్చి రేప్ చేసిన కేసులో దోషికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తన మిత్రుడితో కలిసి మరదలిపైన అత్యాచారం చేసిన కేసులో 23 ఏళ్ల జైలు శిక్ష విధించడం ఇదే ప్రథమం అని న్యాయనిపుణులు చెబుతున్నారు. అత్యాచార కేసుల్లో సాధారణంగా 7 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు కానీ మొదటిసారి సికింద్రాబాద్ కోర్టు ఏకంగా నిందితులకు 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2015 లో ముషీరాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సికింద్రాబాద్ కోర్టు తీర్పు ప్రకటించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Courts in telangana


2015 అక్టోబరు 16న రాత్రి డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంతానికి చెందిన ఓ ఆటోడ్రైవర్‌.. తన మరదలిని ఆమె ఇంటివద్ద దింపుతానంటూ ఆటోలో తీసుకెళ్లాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చాడు. మరదలు స్పృహ కోల్పోయాక మరో ఆటోడ్రైవర్‌ (30)తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉండగానే ఆమెను ఇంటి వద్ద వదిలిపెట్టాడు.

విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ముషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. ఈ కేసులో పకడ్బందీగా ఆధారాలు సేకరించి, చార్జిషీట్‌ దాఖలు చేశారు. పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం కోర్టు నిందితులిద్దరికీ చెరో 23 ఏళ్లు జైలు శిక్ష, రూ. 55 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.