యాప్నగరం

ఈ నంబర్‌కు కాల్ చేస్తే.. ఉచితంగా కరోనా మృతదేహాల తరలింపు..

కరోనా బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలను హాస్పిటల్ నుంచి శ్మశానానికి తరలించడానికి భారీ మొత్తంలో ఖర్చవుతోంది. ఒక్కో సందర్భంలో అంబులెన్స్ సేవలు లభ్యం కావడం లేదు.

Samayam Telugu 27 Jul 2020, 8:05 pm
కరోనా బారిన పడి చనిపోయిన అనాథల మృత దేహాల తరలింపునకు సర్వ్ నీడీ నిర్వాహకులు ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. లాస్ట్ రైడ్‌గా నామకరణం చేసిన ఈ సేవలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ బషీర్‌బాగ్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ.. సామాజిక సేవలో భాగంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులను అభినందించారు.
Samayam Telugu లాస్ట్ రైడ్


ఈ సేవలను పొందడానికి 79954 04040 నంబర్‌కు కాల్‌ చేయాల‌ని సీపీ సూచించారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి సేవలను అందించేందుకు ఐటీ కంపెనీలు కూడా ముందుకు రావాల‌ని సీపీ అంజ‌నీ కుమార్ కోరారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలనే కాకుండా.. ఇతర సమస్యల కారణంగా మరణించిన వారి డెడ్ బాడీలను సైతం ఈ అంబులెన్స్‌లో హాస్పిటల్ నుంచి తరలిస్తారు.

హైదరాబాద్ నగరంలో కరోనా బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి ప్రయివేట్ అంబులెన్స్ నిర్వాహాకులు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. డెడ్ బాడీలను తరలించడం, అంత్యక్రియలకు భారీ మొత్తంలో ఖర్చవుతుండటంతో.. బాధిత కుటుంబాలకు ఆర్థిక భారంగా మారుతోంది.

కరోనా వచ్చిన వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లడం, డెడ్ బాడీలను తరలింపునకు ఎంత ప్రయత్నించినా అంబులెన్స్‌లు దొరక్కపోవడంతో.. సామాజిక కార్యకర్త తేజ తన మిత్రుల సాయంతో కలిసి ఓ పాత ఓమ్నీ వ్యాన్‌ను కొనుగోలు చేసి అంబులెన్స్‌గా మార్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.