యాప్నగరం

హైదరాబాద్‌లో మద్యం నిల్వలు.. తనిఖీల్లో భారీగా స్వాధీనం

Liquor in Hyderabad: లాక్ డౌన్ వేళ మద్యం అక్రమ రవాణా కోసం కొందరు అక్రమార్కులు కొత్త కొత్త దారులు వెతుకుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తోపాటు వరంగల్ రూరల్ జిల్లాలోనూ అక్రమ మద్యం రవాణా వ్యవహార దందా గుట్టు రట్టయింది.

Samayam Telugu 14 Apr 2020, 11:47 pm
లాక్ డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఎక్సైజ్ పోలీసులకు సమాచారం రావడంతో నేరేడ్‌మెట్, వినాయక్ నగర్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తుల ఇంటిపై దాడి చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వినాయక్ నగర్‌లో నివాసం ఉంటున్న బండి విశ్వనాథ్ (32) ఇంట్లో 144 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి.
Samayam Telugu 67592875-2e4d-4b5d-9610-c92c6c8af94b.


అలాగే మంగళవారం మధ్యాహ్న సమయంలో కూడా ఓల్డ్ సఫిల్‌గూడ ప్రాంతంలో ఉండే అమర్ నాథ్(28) అనే వ్యక్తి ఇంట్లో కూడా 204 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లుగా సమాచారం రావడంతో వారి ఇళ్లపై దాడి చేసి 348 మద్యం బాటిళ్లు, రెండు కార్లు, ఒక హోండా ఏక్టివా మోటార్ సైకిల్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఈ దాడిలో మల్కాజ్ గిరి ఎక్సైజ్ పోలీసులతో పాటు ఎస్టీఎఫ్ టీమ్ పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం దాదాపు విలువ 1.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Also Read: undefined

లాక్ డౌన్ వేళ మద్యం అక్రమ రవాణా కోసం కొందరు అక్రమార్కులు కొత్త కొత్త దారులు వెతుకుతున్న సంగతి తెలిసిందే. వరంగల్ రూరల్ జిల్లాలో అక్రమ మద్యం రవాణా వ్యవహార దందా గుట్టు రట్టయింది. మద్యం కేసులను కార్లలో పెద్ద ఎత్తున తరలించేందుకు నిందితులు ఏకంగా పోలీసుల ముసుగు ధరించడం గమనార్హం. కార్లకు పోలీస్ అనే స్టిక్కర్ అతికించి, అందులో మద్యం బాటిళ్లను పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.