యాప్నగరం

ఇంటర్ ఫలితాలు: మరో విద్యార్థిని ఆత్మహత్య

TS Inter: ఇంటర్ ఫలితాలు వెల్లడి అనంతరం తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నలుగురు విద్యార్థులు బలవన్మరనం చెందగా.. తాజాగా మరో విద్యార్థిని ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తండ్రి మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 29 Jun 2022, 10:51 pm
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు కొనసాగుతున్నాయి. ఇంటర్ ఫలితాల వెల్లడి తర్వాత హైదరాబాద్ నగరంలో 24 గంటల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల30న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించడంతో టెన్త్ క్లాస్ చదువుతున్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే నలుగురు విద్యార్థులు ఇలా బలవన్మరణం చెందగా.. నేడు మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంచల్‌గూడలో లహరి అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ చదువుతోంది. నిన్న విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఆమె ఫెయిల్ కావడంతో తండ్రి మందలించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లహరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Representational Image


ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.