యాప్నగరం

Hyderabad Metro రాకతో క్యాబ్ డ్రైవర్లకు కష్టాలు..

గతంలో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు క్యాబ్‌ సర్వీసుల సౌలభ్యాన్ని అందించేవి. ఎంతైన సుదూర ప్రాంతమైనా ఉద్యోగులు క్యాబ్‌లలోనే రావాల్సి వచ్చేది. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ కారణంగా సమయం బాగా వృథా అయ్యేది.

Samayam Telugu 17 Dec 2019, 4:54 pm
హైదరాబాద్‌లో నెలకొన్న ఐటీ, ఫార్మా సంస్థలపై ఆర్థిక మాంద్యం ప్రబావం ఉన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి చూసుకుంటే.. దీని ప్రభావం నగరంలోని క్యాబ్ డ్రైవర్లపై పడుతోంది. ఉద్యోగులను కార్యాలయాలకు తీసుకువచ్చే ట్యాక్సీలకు చెల్లించే బిల్లులను కూడా కొన్ని కంపెనీలు ఇవ్వలేకపోతున్నట్లు సమాచారం. దీనికి తోడు మెట్రో రైలు వాడకం విపరీతంగా పెరగడం క్యాబ్ డ్రైవర్లకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోందని విశ్లేషిస్తున్నారు.
Samayam Telugu Hyderabad cabs


Must Read: Disha Case: ఎన్‌కౌంటర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

మెట్రో రైళ్లు మైండ్ స్పేస్ స్టేషన్ వరకూ నడుస్తుండడం.. అక్కడి నుంచి షటిల్ సర్వీసులు నడుపుతుండడంతో క్యాబ్‌ల అవసరం లేకుండా పోతోంది. అంతకు ముందు కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు క్యాబ్‌ సర్వీసుల సౌలభ్యాన్ని అందించేవి. ఎంతైన సుదూర ప్రాంతమైనా ఉద్యోగులు క్యాబ్‌లలోనే రావాల్సి వచ్చేది. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ కారణంగా సమయం బాగా వృథా అయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారింది. మెట్రో రైళ్ల అందుబాటులోకి రావడం, అందులోనూ ప్రస్తుతం మైండ్ స్పేస్ వరకూ రైళ్లు నడుస్తుండడంతో ఉద్యోగులు కూడా క్యాబ్‌ల వంక చూడట్లేదు. మెట్రో వల్ల సమయం విపరీతంగా ఆదా కావడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. దీంతో కంపెనీలు కూడా క్యాబ్‌ల సంఖ్యను బాగా తగ్గించేశాయి. దీంతో టాక్సీ డ్రైవర్లకు పని తగ్గిపోవడంతో ఆదాయం పడిపోయింది.

Must Read: వీడియో: నీళ్ల ట్యాంకర్ భీభత్సం.. యువతి మృతి

బ్యాంకు రుణాలు, బయట అప్పులు చేసి మరీ కార్లను కొని క్యాబ్‌లను నడుపుకుంటున్న వారి పరిస్థి మరీ దయనీయంగా ఉంది. ఆర్థిక మాంద్యం వల్ల ఐటీ కంపెనీలు క్యాబ్‌ల బిల్లుల చెల్లింపులు వాయిదా వేస్తుండడం, మెట్రో వల్ల వారికి పని తగ్గిపోవడంతో డ్రైవర్లకు ఆదాయంలోనూ తీవ్ర కోత ఏర్పడింది. బ్యాంకు రుణాలపై కార్లు కొన్నవారు ఈఎంఐ కట్టలేక సతమతమవుతున్నారు. కొందరైతే తమ వాహనాలకున్న కమర్షియల్ లైసెన్స్‌ను (పసుపు రంగు నంబర్ ప్లేట్‌) తొలగించి, డొమెస్టిక్ లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు రవాణా శాఖ అధికారులకు ఇప్పటికే 20 వేల వరకు దరఖాస్తులందినట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్‌లోనే ఈ సంఖ్య 15 వేల వరకూ ఉండడం గమనార్హం.

Must Read: ఆరుగురు రైతుల మూకుమ్మడి ఆత్మహత్యాయత్నం..

కమర్షియల్ లైసెన్స్ ఉండే వాహనాలకు మూడు నెలలకోసారి ప్రభుత్వానికి రూ.5 వేలకు పైబడి పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అదే డొమెస్టిక్ ప్లేట్ అయితే, కారు కొనుగోలు చేసే సమయంలో ఒకసారి లైఫ్ టాక్స్ చెల్లిస్తే సరిపోతుంది.

Must Read: ఫ్లైఓవర్ కారు ప్రమాదానికి అసలు కారణమిదీ.. తేల్చిన నిపుణుల కమిటీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.