యాప్నగరం

ట్రాఫిక్‌ ఏఎస్ఐకి పాదాభివందనం.. హైదరాబాద్ పోలీసుల సేవలకు ఫిదా

Man Falls On Police Feet: హైదరాబాద్‌లో పోలీసుల సేవలకు జనం ఫిదా అవుతున్నారు. తిరుమలగిరి పరిధిలో ఓ ట్రాఫిక్ ఏఎస్‌ఐకి స్థానిక యువకుడు ఇలా పాదాభివందనం చేశాడు.

Samayam Telugu 29 Apr 2020, 10:35 am
రోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో మనం సామాజిక దూరం పాటిస్తూ.. మన ఫ్యామిలీ మెంబర్స్‌తో అటాచ్‌గా గడుపుతున్నాం. కానీ, మన పోలీసులు వాళ్ల సొంత కటుంబసభ్యులతోనే డిస్టెన్స్ మెయింటెన్స్ చేస్తూ గడపాల్సి వస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా డ్యూటీ చేస్తున్నారు. అంతేకాకుండా ఆపదలో ఉన్నవారిని, పేదలను ఆదుకుంటున్నారు. అలాంటి పోలీసులకు సెలబ్రిటీలు సహా సామాన్యులు సలాం అంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో ట్రాఫిక్‌ ఏఎస్‌ఐకి ఓ వ్యక్తి పాదాభివందనం చేశాడు.
Samayam Telugu పోలీస్‌కు పాదాభివందనం
Hyd Traffic Police


తిరుమలగిరి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న రాజారావు.. ఓ వైపు లాక్‌డౌన్ విధుల్లో బిజీగా ఉంటూనే కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగృత పరుస్తున్నారు. ఆయన సేవలకు ముగ్ధుడైన అదే ప్రాంతానికి చెందిన సుధీర్‌ రాజు.. ఏఎస్‌ఐ రాజారావును శాలువాతో సత్కరించి, ఆయనకు పాదాభివందనం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది.

Don't Miss: పాప ఫస్ట్ బర్త్‌డే.. పేరెంట్స్ యూఎస్‌లో, సీపీ ఎంట్రీతో మధురంగా!

చైతన్యపురిలో మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఆమె భర్త పాదపూజ చేసిన సంగతి తెలిసిందే. ఇబ్బందులకు వెరవకుండా విధులు సమర్థంగా నిర్వహిస్తున్న ఎస్‌ఐ సంధ్యకు ఆమె అత్తింటి వారు అరుదైన గౌరవం కల్పించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఎస్‌ఐ సంధ్య వినూత్న రీతిలో ప్రచారం కల్పిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Photo Credit: ntnews

Also Read: చైతన్యపురి ఎస్‌ఐకి భర్త పాదపూజ.. అత్తింట్లో అరుదైన గౌరవం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.