యాప్నగరం

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న వ్యక్తి.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

హైదరాబాద్‌లోని చింతల్‌లో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. పట్టపగలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. తీవ్రంగా మంటలు అంటుకున్న అతణ్ని స్థానికులు కాపాడి హాస్పిటల్‌కు తరలించారు.

Samayam Telugu 16 May 2020, 2:34 pm
హైదరాబాద్‌ నగరంలోని చింతల్‌లో దారుణం చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుదర్శన రెడ్డి నగర్‌లో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. పట్టపగలు నడి వీధిలో అతడు మంటల్లో కాలిపోతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై గోనె సంచులతో మంటలు ఆర్పారు. కానీ ఈలోపే అతడికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అతణ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న వ్యక్తి పేరు భువన్ సూర్యారెడ్డి అని పోలీసులు తెలిపారు. వరంగల్ జిల్లా పరకాల అతడి స్వస్థలం, చింతల్‌లో నివాసం ఉంటున్న అతడు.. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగు నెలల పాప ఉంది. గత కొంత కాలంగా అతడు మద్యానికి బానిస అయ్యాడు. దీంతో భార్య వెంకటేశ్వరనగర్‌లోని తన సోదరుడి ఇంటికి వెళ్లింది. శుక్రవారం మద్యం సేవించిన భువన్.. అక్కడికి వెళ్లి కాపురానికి రావాలని గొడవ చేశాడు. విడాకులు ఇస్తానని ఆమె చెప్పడంతో.. మనస్తాపానికి గురై ఈ దారుణానికి తెగబడ్డాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.