యాప్నగరం

హైదరాబాద్ మేయర్‌కు రెండోసారి కరోనా నెగెటివ్‌

Hyderabad Coronavirus: గురువారం ఆయన నుంచి వైద్యులు నమూనాలు సేకరించారు. ఆ నివేదికల్లో నెగెటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో మేయర్‌ కుటుంబసభ్యులు, జీహెచ్ఎంసీ అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Samayam Telugu 13 Jun 2020, 6:00 pm
జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ) మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా నెగెటివ్ అని తేలింది. ఆయనకు శుక్రవారం రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. మేయర్‌కు నెగటివ్‌గా నిర్ధారణ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం మేయర్ పేషీలో ఓ అంటెండర్‌కు, గురువారం మేయర్‌ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో మేయర్‌కు కూడా కరోనా సోకి ఉంటుందేమో అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా మేయర్‌కు కొవిడ్‌ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.
Samayam Telugu బొంతు రామ్మోహన్
Bonthu Rammohan


ఇందులో భాగంగానే గురువారం ఆయన నుంచి వైద్యులు నమూనాలు సేకరించారు. ఆ నివేదికల్లో నెగెటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో మేయర్‌ కుటుంబసభ్యులు, జీహెచ్ఎంసీ అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కొద్ది రోజుల క్రితం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గతంలో నగరంలోని రోడ్డు పక్కనే ఉన్న ఓ చాయ్ దుకాణంలో అధికారులతో కలిసి మేయర్‌ సరదాగా టీ తాగారు. ఆ హోటల్‌లో పనిచేసిన వ్యక్తికి కరోనా వచ్చిందని తేలడంతో వారం క్రితం మేయర్‌ సైతం పరీక్ష చేయించుకోగా ఆ నివేదికల్లో నెగెటివ్‌ వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.