యాప్నగరం

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మే 16 నాటికి తుపాను!: వాతారవణ శాఖ

Meteorological Department: నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే సూచనలు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేశారు. ఈ నెల 17 వరకూ వాయువ్య దిశగా, ఆ తర్వాత ఈశాన్య దిశకు ఇది మారుతుందని విశ్లేషించారు.

Samayam Telugu 13 May 2020, 3:47 pm
బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడినట్లుగా హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దక్షిణ అండమాన్ సముద్రం వద్ద ఉపరితల ఆవర్తన ప్రభావం ఉందని చెప్పారు. దీంతో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని వివరించారు. అనుబంధంగా ట్రోపోస్పియర్ స్థాయి ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కూడా ఉందని చెప్పారు. అయితే, మే 15న ఈ అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. అంతటితో ఆగకుండా మే 16న సాయంత్రానికి వాయుగుండం తుపానుగా మారే సూచనలు ఉన్నట్లుగా చెప్పారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే సూచనలు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేశారు. ఈ నెల 17 వరకూ వాయువ్య దిశగా, ఆ తర్వాత ఈశాన్య దిశకు ఇది మారుతుందని విశ్లేషించారు. ఇక నికోబార్ దీవులను నైరుతి రుతుపవనాలు మే 16న తాకుతాయని చెప్పారు.

ఇక తెలంగాణలో రాగల మూడు రోజుల్లో వాతావరణ అంచనాలను అధికారులు వివరించారు. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు. గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని అంచనా వేశారు. రాబోయే రెండు రోజులు అక్కడక్కడ 40 నుంచి 43 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.