యాప్నగరం

తెలంగాణలో దిమ్మతిరిగే ఉష్ణోగ్రతలు.. మరో 3 రోజులు ఇలా..

Telangana Weather: గత నాలుగైదు రోజులుగా ఈ వడగాల్పుల తీవ్రత ఉంటూ వస్తోంది. ఈ ఎండకు వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Samayam Telugu 24 May 2020, 6:27 pm
తెలంగాణలో కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే మిట్టమధ్యాహ్నం తరహాలో ఎండ, వేడి వస్తోంది. బయటకు వెళ్తే ఒంట్లోని సారం మొత్తాన్ని భానుడు పీల్చేస్తున్నాడు. దీనికి తోడు మధ్యాహ్నం సమయంలో వడగాడ్పుల ధాటికి ప్రజలు తపించిపోతున్నారు. గత నాలుగైదు రోజులుగా ఈ వడగాల్పుల తీవ్రత ఉంటూ వస్తోంది. ఈ ఎండకు వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాగల రెండు రోజుల పాటు ఇదే స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను ప్రకటించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Heat waves in Telagana


ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు వాతావరణ అధికారులు తెలిపిన ప్రకారం.. అత్యధికంగా జగిత్యాలలో 47. 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత పెద్దపల్లిలో 47, మంచిర్యాలలో 46.9, నల్గొండలో 46.8, పెద్దపల్లిలో 46.7, భద్రాద్రి కొత్తగూడెంలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు ప్రకటించారు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే బేగంపేట ఎయిర్‌పోర్టు పరిసరాల్లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత, హయత్‌నగర్‌లో 41.8, హకీంపేటలో 42.8, రాజేంద్రనగర్‌లో 42.5, ఇక్రిశాట్‌ పటాన్‌ చెరులో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. శనివారం నాటి వేడితో పోల్చితే ఆదివారం అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయని, సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలో మీటర్ల నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు.

Also Read: undefined

రాగల 3 రోజుల్లో ఇలా..
రాగల 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. పలు జిల్లాల్లో అక్కడక్కడ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ఆది, సోమవారాల్లో నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, వరంగల్‌ రూరల్‌, నల్లగొండ, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

Also Read: ఎంపీ అర్వింద్‌ మెడకు బలమైన ఉచ్చు.. ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

ఇక 26న నిజామాబాద్‌, జగిత్యాల, ములుగు, వరంగల్‌ రూరల్‌, నల్లగొండ, ఖమ్మం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం, నిర్మల్‌, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

Also Read: ప్రభుత్వం ఇంత నీచ స్థితికి దిగజారుతుందా? బండి సంజయ్ ధ్వజం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.