యాప్నగరం

Hyd మెట్రో పున:ప్రారంభానికి ఏర్పాట్లు.. కొత్త నిబంధనలివే.. వీళ్లకి నో ఎంట్రీ

Hyderabad Metro: కరోనా ధాటికి గత మార్చి 22 నుంచి మెట్రో సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దేశంలోని రెండో అతి పొడవైన మెట్రో వ్యవస్థ కలిగిన హెచ్ఎంఆర్ సంస్థ రోజుకు 55 రైళ్లతో రాకపోకలు సాగిస్తోంది.

Samayam Telugu 2 Sep 2020, 7:44 pm
అన్‌లాక్ 4 మార్గదర్శకాలను అనుసరించి హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల ప్రారంభానికి హెచ్‌ఎంఆర్‌ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు 7 నుంచి పట్టాలపై మెట్రో రైళ్లు పరుగులు తీయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో రైళ్లు ప్రారంభం అయ్యాక కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్నారు. పిల్లలు, వయసు పైబడిన వారి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
hyderabad metro r pool


వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు మెట్రో రైలులోకి ప్రవేశాన్ని కల్పించడాన్ని తాత్కాలికంగా నిషేధించనున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో లిఫ్టులను పూర్తిగా ఆపేయనున్నారు. అంతేకాక, టికెట్లను కూడా కౌంటర్ల నుంచి నేరుగా కొనుక్కోవడానికి స్వస్తి పలకనున్నారు. ప్రయాణానికి స్మార్ట్ కార్డులు లేదా డిజిటల్ టికెట్లకు మాత్రమే అనుమతి ఉందని హెచ్ఎంఆర్ సంస్థ వెల్లడించింది. గత 6 నెలలుగా సర్వీసులు నిలిపివేయడంతో 3 కారిడార్లు, 57 మెట్రో స్టేషన్లలో క్లీనింగ్‌, శానిటేషన్‌ పనులను అధికారులు చేస్తున్నారు. రెండు రోజుల్లో హెచ్‌ఎంఆర్‌ పూర్తి గైడ్‌లైన్స్ విడుదల చేసే అవకాశం ఉంది.

కరోనా ధాటికి గత మార్చి 22 నుంచి మెట్రో సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దేశంలోని రెండో అతి పొడవైన మెట్రో వ్యవస్థ కలిగిన హెచ్ఎంఆర్ సంస్థ రోజుకు 55 రైళ్లతో రాకపోకలు సాగిస్తోంది. 4.5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. కొవిడ్‌తో గత ఆర్నెల్లుగా రైళ్లు డిపోలకే పరిమితం కావడంతో సంస్థకు కోట్ల కొద్దీ నష్టం వాటిల్లింది.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.