యాప్నగరం

హైదరాబాదీలకు అలర్ట్.. మారిన మెట్రో రైలు టైమింగ్స్

Hyderabad Metro: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మెట్రో సేవలు సుమారు ఐదున్నర నెలలు తిరగలేదు. అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్ వచ్చిన తర్వాత మళ్లీ మెట్రో రైళ్లు సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యాయి.

Samayam Telugu 28 Oct 2020, 3:59 pm
ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్ల సమయాన్ని అధికారులు పొడిగించారు. అంటే ఇక నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం రాత్రి 9 గంటల వరకే చివరి మెట్రో రైలు నడుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది. రాత్రి 10 గంటల వరకు మెట్రో రైళ్లు నడపాలన్న డిమాండ్లు ప్రయాణికుల నుంచి వస్తున్నాయి. కరోనా సంక్షోభం కన్నా ముందు మెట్రో రైళ్లు రాత్రి 10 గంటల వరకు నడిచేవి. అయితే ప్రయాణికుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు మరో అరగంట సమయాన్ని మాత్రం పొడిగించారు. అక్టోబర్ 28 నుంచి ఇది అమల్లోకి రానుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
hyderabad metro rail


కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మెట్రో సేవలు సుమారు ఐదున్నర నెలలు తిరగలేదు. అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్ వచ్చిన తర్వాత మళ్లీ మెట్రో రైళ్లు సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యాయి. అయితే మొదట మూడు కారిడార్లలో కొద్దిసేపు మాత్రమే ఈ రైళ్లు నడిచేవి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లు తిరిగేవి. ఆ తర్వాత ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లను నడుపుతున్నారు. ఇప్పుడు మరో అరగంట పొడిగించి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైలు సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

మరోవైపు, మళ్లీ ప్రయాణికులను తమవైపు ఆకర్షించుకొనేందుకు హైదరాబాద్ మెట్రో అద్భుతమైన ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త స్మార్ట్ కార్డ్ తీసుకున్న వారికి ప్రతి ట్రిప్‌పై 50 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అక్టోబర్ 17న మొదలైన ఈ ఆఫర్ 2021 జనవరి 16 వరకు ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.