Hyderabad Metro Rail Md Nvs Reddy Clarifies On Monthly Passes
మెట్రో పాసులుంటాయా? ఉండవా? తేల్చిచెప్పిన హెచ్ఎంఆర్ ఎండీ
హైదరాబాద్ మెట్రో రైళ్లలో నెలవారీ మంత్లీ పాసులు జారీ చేయడం సాధ్యం కాదని సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మెట్రో రైలు సంస్థలో ఇప్పటివరకూ కేవలం 4 మెట్రో రైలు ప్రాజెక్టులే లాభాల్లో ఉన్నాయని, ఇక భారత్లో దిల్లీ, హైదరాబాద్ మెట్రోలే విజయవంతంగా నడుస్తున్నాయని వివరించారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో మొదటి దశ ప్రాజెక్టు కింద 69 కిలో మీటర్ల మెట్రో కారిడార్ పూర్తయిందని, ఇందులో భాగంగా పాతబస్తీకి మరో 5 కిలో మీటర్ల దూరం నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు.
Samayam Telugu26 Feb 2020, 1:08 pm
హైదరాబాద్ మెట్రో రైళ్లలో నెలవారీ మంత్లీ పాసులు జారీ చేయడం సాధ్యం కాదని సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మెట్రో రైలు సంస్థలో ఇప్పటివరకూ కేవలం 4 మెట్రో రైలు ప్రాజెక్టులే లాభాల్లో ఉన్నాయని, ఇక భారత్లో దిల్లీ, హైదరాబాద్ మెట్రోలే విజయవంతంగా నడుస్తున్నాయని వివరించారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో మొదటి దశ ప్రాజెక్టు కింద 69 కిలో మీటర్ల మెట్రో కారిడార్ పూర్తయిందని, ఇందులో భాగంగా పాతబస్తీకి మరో 5 కిలో మీటర్ల దూరం నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు.
నిబంధనల ప్రకారమే టికెట్ ధరలు...
మెట్రో రైలు ప్రాజెక్టులో టికెట్ ధరలు నిబంధనల ప్రకారమే ఉన్నట్లు ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని మెట్రో రైలు చట్టం ప్రకారం ఛార్జీల నిర్ధారణ కమిటీ నిర్ణయించిన ధరలనే ప్రస్తుతం ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో అన్నింటికన్నా హైదరాబాద్ మెట్రో రైలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పష్టత నిచ్చారు. ఏటా ఛార్జీలు పెంచుకునేందుకు అవకాశం ఉందని, దాని ప్రకారమే ధరలు పెంచామని వివరించారు.
అందుకే పాసులివ్వలేం
దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో నిర్మించిన మెట్రో ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలకు వడ్డీ 1 నుంచి 1.5 శాతం ఉండగా, హైదరాబాద్ మెట్రో కోసం ఎల్ అండ్ టీ సంస్థ తీసుకున్న రూ.12 వేల కోట్ల రుణాలకు వడ్డీ 11 శాతం ఉందని వివరించారు. దీనివల్ల నిర్మాణ సంస్థపై భారం ఎక్కువగా పడుతోందని, ఈ కారణంగానే టికెట్ ధరల తగ్గింపు, ఇంకా నెలవారీ మంత్లీ పాసులు, వివిధ వర్గాల వారికి రకరకాల రాయితీలు వంటి వెసులుబాట్లు ఇచ్చేందుకు అవకాశం లేదని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
నెలకు రూ. 40 కోట్ల ఆదాయం..
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు వల్ల మొత్తం రూ.40 కోట్ల ఆదాయం వస్తోందని, టికెట్ల ద్వారా రూ.30 కోట్లు, రియల్ ఎస్టేట్, ప్రకటనల ద్వారా రూ.10 కోట్ల ఆదాయం వస్తోందని వివరించారు. ఎల్ అండ్టీ ఖర్చు చేసిన మొత్తానికి ఏటా సుమారు రూ.1,300 కోట్ల వరకూ వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటోందని వివరించారు. ఈ అప్పుల భారం ఓ కొలిక్కి వచ్చేందుకు మరో 7 నుంచి 8 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ పరంగా 1.85 కోట్ల చదరపు అడుగుల విస్తర్ణంలో వ్యాపార భవనాలను నిర్మించాలని, ఇప్పటి వరకు కేవలం 4 నాలుగు షాపింగ్ మాల్స్ నిర్మించామని చెప్పారు. రాయదుర్గంలో 15 ఎకరాల్లో ఐటీ కంపెనీల కోసం భవనాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు. వీటన్నింటినీ పూర్తి చేసి అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుందని తద్వారా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు లాభాల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో చేపట్టే మెట్రో ప్రాజెక్టులకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కన్సల్టెంట్గా ఉండే అవకాశముందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇటీవల టీటీడీ చైర్మన్ ఆహ్వానం మేరకు తిరుమలకు వెళ్లానని, అక్కడ మెట్రో రైలు ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై చర్చించామని గుర్తు చేశారు. అయితే, అక్కడి ఆగమ పండితులు మెట్రోకు ఒప్పుకునే పరిస్థితులు లేవని, దీనికి తోడు తిరుమల మొత్తం రిజర్వ్ ప్రాజెక్టు కింద ప్రకటించారని చెప్పారు. ఈ కారణాల వల్ల మెట్రో రైలు అక్కడ సాధ్యం కాదని చెప్పారు. రెండు మూడు నెలల పాటు సర్వే చేసిన అనంతరం తిరుపతిలో మెట్రో ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకునే అవకాశముందని అన్నారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.