యాప్నగరం

హైదరాబాద్ మెట్రో రైళ్లు పున: ప్రారంభం.. ప్రతీ 5 నిమిషాలకో ట్రైన్

మార్చి నుంచి గ్రేటర్‌లో మెట్రో రైలు సేవలకు బ్రేకులు పడ్డాయి. కరోనా కారణంగా సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో మెట్రో సేవలు తిరిగి ప్రారంభించారు.

Samayam Telugu 7 Sep 2020, 10:13 am
హైదరాబాద్‌లో మెట్రో పరుగులు మొదలయ్యాయి. ఇవాల్టి నుంచి మెట్రో రైల్ సర్వీసులు పున: ప్రారంభం చేశారు అధికారులు. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 22 నుంచి మెట్రో సర్వీసులు నిలిచిన సంగతి తెలిసిందే. అన్ లాక్ ప్రక్రియతో కేంద్రం మెట్రో ట్రైన్ సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైళ్ల సేవలుు ప్రారంభించాలా వద్దా ? అనే నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. దీంతో రాష్ట్ర సర్కార్ సైతం మెట్రో సర్వీసులు పున: ప్రారంభానికి జెండా ఊపింది దీంతో ఐదున్నర నెలల తర్వాత మళ్లీ ప్రారంభమయ్యాయి.
Samayam Telugu metro


ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రైళ్లు నడుస్తున్నాయి. మొదటి విడుతలో భాగంగా మియాపూర్‌-ఎల్బీనగర్ కారిడార్‌లో ప్రయాణికులకు మెట్రో రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. దశవారీగా మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Read More: తెలంగాణ ప్రజలకు ఊరట.. కొత్తగా 1802 కరోనా కేసులు

ఇవాళ ఎల్బీనగర్‌-మియాపూర్ కారిడార్‌లో ప్రారంభమవగా, రేపు నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, ఈ నెల 9 నుంచి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్‌లో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. అయితే కంటోన్మెంట్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. గాంధీ దవాఖాన, భరత్‌నగర్‌, మూసాపేట, యూసఫ్‌గూడా మెట్రో స్టేషన్లను మూసివేశారు. కరోనా నేపథ్యంలో ప్రయాణికులు సామాజిక దూరం పాటించేలా స్టేషన్లు, రైళ్లలో మార్కింగ్ ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.