హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో రైలు వేళల్లో మార్పులు
కరోనావైరస్ కారణంగా మెట్రో రైలును ఉదయం 7 గంటలకు ప్రారంభించారు. కానీ ఇవాల్టి నుంచి ఆ సమయాన్ని మార్చారు. పొద్దున్న 6 గంటలకే మెట్రో సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
Samayam Telugu 3 Dec 2020, 8:30 am
హైదరాబాద్లో మెట్రో స్టేషన్లు పున: ప్రారంభం అయ్యాయి. కరోనా కారణంగా కొన్ని స్టేషన్లలో ఇప్పటికే సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన మరికొన్ని చోట్ల మాత్రం ఇంకా ప్రారంభించలేదు. దీంతో తాజాగా భరత్నగర్, ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రిలోనూ మెట్రో సేవలు ప్రారంభిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు తప్పకుండా మాస్కులు ధరించి కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అంతేకాకుండా మెట్రో రైళ్ల టైమింగ్స్లో కూడా మార్పులు చేశామన్నారు.
Read More: Ghmc Elections: ఓల్ట్మలక్పేటలో ప్రారంభమైన రీపోలింగ్
ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లను ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆరున్నరకే ప్రారంభిస్తున్నారు. ఆయా కారిడార్ల నుంచి రాత్రి 9.30 నిమిషాలకు ప్రారంభమయ్యే చివరి రైలు 10.30కు టెర్మినల్ స్టేషన్కు చేరుకుంటుందని అధికారులు చెప్పారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ప్రయాణ సమయం పొడిగింపు చేయడం జరిగిందని మెట్రోరైల్ ఎండీ వెల్లడించారు. ఇక ఇవాల్టి నుంచి భరత్నగర్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్ మెట్రో స్టేషన్లు తెరుచుకోను న్నాయని అధికారులు వెల్లడించారు.
Read More: Ghmc Elections: ఓల్ట్మలక్పేటలో ప్రారంభమైన రీపోలింగ్
ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లను ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆరున్నరకే ప్రారంభిస్తున్నారు. ఆయా కారిడార్ల నుంచి రాత్రి 9.30 నిమిషాలకు ప్రారంభమయ్యే చివరి రైలు 10.30కు టెర్మినల్ స్టేషన్కు చేరుకుంటుందని అధికారులు చెప్పారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ప్రయాణ సమయం పొడిగింపు చేయడం జరిగిందని మెట్రోరైల్ ఎండీ వెల్లడించారు. ఇక ఇవాల్టి నుంచి భరత్నగర్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్ మెట్రో స్టేషన్లు తెరుచుకోను న్నాయని అధికారులు వెల్లడించారు.