యాప్నగరం

Janata Curfew: హైదరాబాద్‌ మెట్రో రైళ్లు బంద్

Coronavirus Hyderabad: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆదివారం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఆదివారం నుంచి ఈ మూసివేత 29 వరకూ అమలులో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Samayam Telugu 21 Mar 2020, 1:28 pm
ప్రధాని మోదీ ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మెట్రో రైలు సేవలు సైతం నిలిపివేయాలని హైదరాబాద్‌ మెట్రో సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలను ఆదివారం నిలిపివేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రకటించే అవకాశం ఉంది. కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రయాణికులకు మెట్రో సంస్థ అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, దిల్లీ మెట్రో సేవలను సైతం నిలిపివేస్తున్నట్టు శుక్రవారమే ఆ సంస్థ ప్రకటించింది. మరోవైపు, జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం సాధారణ రైలు సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి.
Samayam Telugu metro.


అంతేకాక, మెట్రో అనుబంధ షాపింగ్ మాల్స్ అయిన గలేరియా మాల్స్‌ను కూడా మూసి వేస్తామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రతి మూడు గంటలకోసారి కోచ్‌లను ప్రత్యేక రసాయనాలతో శుభ్రం చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: పెళ్లిలో మంత్రాలకు బదులు కరోనా వైరస్ స్తోత్రాలు.. వీడియో వైరల్

మరోవైపు, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆదివారం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఆదివారం నుంచి ఈ మూసివేత 29 వరకూ అమలులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వచ్చే అన్ని దేశాల అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. కేంద్రం ఆదేశాలతోనే విమానాల సర్వీసులను రద్దు చేసినట్లుగా ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు.

Also Read: రేవంత్‌ను తిట్టి, సీఎంను వెనకేసుకొచ్చి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.