హైదరాబాద్ కోఠిలోని కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు 150 వరకూ నర్సులు సోమవారం ఆందోళన చేపట్టారు. గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో కరోనా రోగులకు అందించే సేవల కోసం ఒప్పంద పద్ధతిలో తమను నియమించుకుంటామని తొలుత ప్రభుత్వ అధికారులు చెప్పారని వారు అన్నారు. ఆ తర్వాత అధికారులు మాట తప్పారని, అందుకే నిరసన ప్రదర్శన చేస్తున్నట్లు నర్సులు వెల్లడించారు.
Must Read: కరోనా రోగి మరో వీడియో వైరల్.. ఏకంగా మంత్రి ఈటలకు ఫోన్ చేసి..
ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న తామందరినీ ప్రభుత్వ నోటిఫికేషన్ అంటూ తీసుకొచ్చి రోడ్డున పడేశారని నర్సులు వాపోయారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతి అంటూ తమని మోసం చేసిందని, కనీసం ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా తమ ఉద్యోగాలు పోయాయని నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు కలగజేసుకొని అక్కడ నుంచి వెళ్లిపోవాలని నచ్చజెప్పినా ఫలితం లేదు. తమ సమస్యపై వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో మంత్రి ఈటల రాజేందర్ కొవిడ్ కమాండ్ సెంటర్లో కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
Must Read: undefined
Must Read: కరోనా రోగి మరో వీడియో వైరల్.. ఏకంగా మంత్రి ఈటలకు ఫోన్ చేసి..
ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న తామందరినీ ప్రభుత్వ నోటిఫికేషన్ అంటూ తీసుకొచ్చి రోడ్డున పడేశారని నర్సులు వాపోయారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతి అంటూ తమని మోసం చేసిందని, కనీసం ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా తమ ఉద్యోగాలు పోయాయని నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు కలగజేసుకొని అక్కడ నుంచి వెళ్లిపోవాలని నచ్చజెప్పినా ఫలితం లేదు. తమ సమస్యపై వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో మంత్రి ఈటల రాజేందర్ కొవిడ్ కమాండ్ సెంటర్లో కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
Must Read: undefined