యాప్నగరం

Hyderabad: అనసూయని వేధిస్తోంది ఇతనే.. ఆమె ఫొటో, వీడియో చూస్తే చాలు..

Hyderabad: యాంకర్ అనసూయని సోషల్ మీడియాలో వేధిస్తోన్న నెటిజన్‌ను పోలీసులు పట్టేసుకున్నారు. ఇన్ని రోజులు దొరకకుండా తప్పించుకున్న వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. అయితే.. అనసూయను సోషల్ మీడియా వేదికగా వేధిస్తోన్న ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఇతన్ని పట్టుకునేందుకు పోలీసులు వారం రోజుల పాటు కోనసీమలో మకాం వేసి పట్టుకున్నారు. అయితే.. ఇన్ని రోజులు పోలీసులకు దొరకకుండా ఈ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడంటే..

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 27 Nov 2022, 10:39 am

ప్రధానాంశాలు:

  • యాంకర్ అనసూయను వేధిస్తోన్న వ్యక్తి అరెస్ట్
  • ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా వ్యక్తిగా గుర్తింపు
  • కోనసీమలో వారం రోజు మకాం వేసి పట్టుకున్న పోలీసులు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu anasuya new
Hyderabad: యాంకర్ కం యాక్టర్ అనసూయని సోషల్ మీడియాలో వేధిస్తోన్న వ్యక్తి దొరికేశాడు. అనసూయ ఫొటోలు, వీడియోలపై అసభ్యకరమైన కామెంట్లు పెట్టి వైరల్ చేస్తున్న నెటిజన్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అనసూయ వ్యక్తిగత జీవితంపై అభ్యంతరకరమైన కామెంట్లు చేస్తున్న వ్యక్తిని పోలీసులు కనిపెట్టి అరెస్టు చేశారు. ఇన్ని రోజులు ఇవన్ని చేస్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పాసలపూడి గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి పండరి రామ వెంకట వీర్రాజుగా పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా అనసూయని సోషల్ మీడియాలో పండరి వేధిస్తున్నాడు. అనసూయ తన సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు, వీడియోలకు అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్న పలువురు వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. అనసూయ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఇన్ని రోజులు మొబైల్ ఫోన్లు మారుస్తూ పండరి పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. వారం రోజులు పాటు కోనసీమలో మకాం వేసిన పోలీసులు చిట్ట చివరకు పండరిని అరెస్ట్ చేశారు.
టాలీవుడ్ యాంకర్ అనసూయ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు 354 (A)(D), 559 ఐపీసీ సెక్షన్ 67 67(A) ఐటీ యాక్ట్ 2000, 2018 నిందితుడు పండరిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ యాప్స్‌లో టాలీవుడ్ హీరోయిన్స్ ఫొటోస్ పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్నట్టు తేలింది. ఈనెల 17న సైబర్ క్రైమ్ పోలీసులకు యాంకర్ అనసూయ ఫిర్యాదు చేసింది. "సాయి రవి 267" అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా హీరోయిన్స్ ఫొటోస్ పెడుతున్నాడు. నిందితుడు గతంలో మూడేళ్లపాటు దుబాయిలో ప్లంబర్ వర్క్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. యాంకర్స్, హీరోయిన్స్‌ను టార్గెట్ చేసి వాళ్లకు సంబంధించిన ఫొటోలతో పోస్టు పెడుతున్నాడు. ఇందులో అనసూయ, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలతో పాటు మంత్రి రోజా ఫొటోలు కూడా పోస్టు చేశాడు.


  • Read More Telangana News and Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.