Hyderabad Police Follows Different Method Over Riders In Janta Curfew Time
Janta Caurfew: వినూత్నంగా బుద్ధి చెప్పిన పోలీసులు.. సిగ్గుతో జనం అవస్థలు
జనతా కర్ఫ్యూ అమలులో ఉన్నా రోడ్డుపైకి వస్తున్న వాహనదారులు, వ్యక్తులకు హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెబుతున్నారు. వారి బాధ్యతను గుర్తుకు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తీరు మర్యాదపూర్వకంగానే ఉన్నా.. అది మాత్రం వాహనదారులకు చెంపపెట్టులా అనిపిస్తోంది. జనతా కర్ఫ్యూ సందర్భంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి, అంతా ఇంట్లోనే ఉన్న వేళ.. అయినా రోడ్లపై తిరుగుతూ కనిపించిన వారికి ట్రాఫిక్ పోలీసులు, కూడళ్లలో ఉన్న సాధారణ పోలీసులు వారిని ఆపి దండం పెడుతున్నారు. దీంతో వాహనదారులు తాము చేసిన పనికి తామే సిగ్గుపడుతున్నారు. ఈ ఫోటోలను హైదరాబాద్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు దేశమంతా ఏకమై కర్ఫ్యూ పాటిస్తున్న తరుణంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు బాగా బుద్ధి చెప్పారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వారిని ఏమీ అనకుండా, కనీసం చలాన్లు కూడా వేయకుండా ఇలా నమస్కారం పెట్టడంతో పోలీసులపై నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
జనతా కర్ఫ్యూ అమలులో ఉన్నా రోడ్డుపైకి వస్తున్న వాహనదారులు, వ్యక్తులకు హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెబుతున్నారు. వారి బాధ్యతను గుర్తుకు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తీరు మర్యాదపూర్వకంగానే ఉన్నా.. అది మాత్రం వాహనదారులకు చెంపపెట్టులా అనిపిస్తోంది. జనతా కర్ఫ్యూ సందర్భంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి, అంతా ఇంట్లోనే ఉన్న వేళ.. అయినా రోడ్లపై తిరుగుతూ కనిపించిన వారికి ట్రాఫిక్ పోలీసులు, కూడళ్లలో ఉన్న సాధారణ పోలీసులు వారిని ఆపి దండం పెడుతున్నారు. దీంతో వాహనదారులు తాము చేసిన పనికి తామే సిగ్గుపడుతున్నారు. ఈ ఫోటోలను హైదరాబాద్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు దేశమంతా ఏకమై కర్ఫ్యూ పాటిస్తున్న తరుణంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు బాగా బుద్ధి చెప్పారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వారిని ఏమీ అనకుండా, కనీసం చలాన్లు కూడా వేయకుండా ఇలా నమస్కారం పెట్టడంతో పోలీసులపై నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ పోలీసుల పట్ల గర్వంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొక వ్యక్తి ఇలాంటి వారిని కర్రలతో కొట్టాలని కామెంట్ రాశాడు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలిసారి అంతా ఏకమై ఇలా కర్ఫ్యూ పాటిస్తున్నందుకు సంతోషంగా ఉందని మరొకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో వ్యక్తి స్పందిస్తూ.. హైదరాబాద్ పోలీసుల పట్ల గౌరవం మరింత పెరిగిందని, వారు ఆరోగ్యంగా జీవించాలని కామెంట్ చేశాడు. మన దేశ భవిష్యత్తు, భద్రత కోసం ఇలా రోడ్లపై తిరుగుతున్న వారు మారాలని మరో ట్విటర్ యూజర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించి పెద్ద ఎత్తున చలాన్లు విధించాలని మరో వ్యక్తి ఆకాంక్షించాడు.
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 22కి చేరింది. తాజాగా కరోనా సోకిన బాధిత యువకుడు ఇటీవల లండన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఇతని స్వస్థలం ఏపీలోని గుంటూరుకు చెందిన యువకుడిగా గుర్తించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇతని వయసు 24 ఏళ్లు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అతనికి గాంధీ ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఒకవేళ పరిస్థితులు అదుపుదాటితే లాక్ డౌన్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
మరోవైపు, హైదరాబాద్లో జరుగుతున్న జనతా కర్ఫ్యూపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో 99 శాతం ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారని, ఈ పరిణామం ఎంతో సంతోషకరమని చెప్పారు. ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛంగా ఇంట్లోనే ఉండిపోవాలనే అవగాహన ప్రజల్లో కలగడం గొప్ప విషయమని కొనియాడారు. అసలు జనతా కర్ఫ్యూ దేశంలో ఇలా అమలు కావడం దేశ చరిత్రలోనే తొలిసారి అని కితాబిచ్చారు. దేశంలో కరోనా వైరస్కు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 24 గంటల పాటు కర్ఫ్యూ జరుగుతోందని చెప్పారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.