యాప్నగరం

హైదరాబాద్‌లో చైనీయుల కలకలం.. పోలీసులకు చిక్కిన జంట

Coronavirus in Hyderabad: ఆ ముగ్గురిలో ఇద్దరు చైనాకు చెందిన వ్యక్తులు కాగా, మరొకరు నాగాలాండ్‌కి చెందిన అమ్మాయి అని పోలీసులు నిర్ధరించారు. వారి వివరాలు పోలీసులు ఆరా తీయగా.. ఆ ముగ్గురు దాదాపు ఏడాది క్రితమే నగరానికి వచ్చినట్లు చెప్పారు.

Samayam Telugu 16 Apr 2020, 10:48 pm
తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నగరంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పోలీసులు బాగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విదేశీయులు ఎక్కడ కనిపించినా ప్రజలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం నాటి తనిఖీల్లో చైనాకు చెందిన ఓ జంటతో పాటు నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి పోలీసులకు చిక్కారు.
Samayam Telugu EVaI5GNU0AI7o3P


పోలీసులకు వీరు ఎర్రగడ్డ ప్రాంతంలో చిక్కారు. ఈ ముగ్గురూ ఒకే కారులో గురువారం సాయంత్రం ఎర్రగడ్డ ప్రాంతం వైపు నుంచి మూసాపేట వైపు వెళ్తున్నారు. ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టు వద్దకు రాగానే వారి కారును పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగానే ఆపారు. తనిఖీ చేయగా అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దీంతో వారిని కిందికి దింపి పోలీసులు విచారణ జరిపారు.

Must Read: undefined

ఆ ముగ్గురిలో ఇద్దరు చైనాకు చెందిన వ్యక్తులు కాగా, మరొకరు నాగాలాండ్‌కి చెందిన అమ్మాయి అని పోలీసులు నిర్ధరించారు. వారి వివరాలు పోలీసులు ఆరా తీయగా.. ఆ ముగ్గురు దాదాపు ఏడాది క్రితమే నగరానికి వచ్చినట్లు చెప్పారు. కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లోని లోధా బెల్లేజా అపార్ట్‌మెంట్‌లలో ఉంటున్నట్లుగా వెల్లడించారు. అయితే, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని క్వారంటైన్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.