యాప్నగరం

నకిలీ విజయ్ దేవరకొండ.. లీలలు తెలిస్తే షాక్! పట్టుకున్న పోలీసులు

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గొంతుతో మాట్లాడి వీడియోలను సైతం పోస్ట్ చేశాడు. వీటిని చూసిన హీరో విజయ్ దేవరకొండ సిబ్బంది చూసి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 7 Mar 2020, 11:08 am
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఇతను యూ ట్యూబ్‌లో ఛానెల్ ప్రారంభించి, విజయ్ దేవరకొండ గొంతును అనుకరించి అమ్మాయిలను ఆకర్షించేందుకు యత్నించేవాడు. అంతకుముందు హీరో విజయ్ దేవరకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేయగా.. అతను సాయి కిరణ్ అలియాస్ డబ్బింగ్ విజయ దేవరకొండగా గుర్తించారు. పోలీసులు శుక్రవారం అతనికి నోటీసులు కూడా ఇచ్చారు.
Samayam Telugu Fake vijay devarakonda


తనను కలవాలంటే ముందుగా సాయికిరణ్‌ను సంప్రదించాలంటూ నిందితుడు తన ఫోన్ నంబర్‌ను యూట్యూబ్‌లో ఉంచాడు. విజయ్ దేవరకొండ గొంతుతో మాట్లాడి వీడియోలను సైతం పోస్ట్ చేశాడు. వీటిని చూసిన హీరో విజయ్ దేవరకొండ అనుచరుడు చూసి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనివల్ల హీరో స్టేటస్ దెబ్బతింటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దీంతో వలపన్ని నిందితుణ్ని పోలీసులు పట్టుకున్నారు. ఓ అమ్మాయిలా సాయికిరణ్‌తో మాట్లాడించి.. వాట్సప్‌లో ఛాటింగ్ చేయించారు. అది నిజమే అని నమ్మిన సాయికిరణ్ వాట్సప్ చాటింగ్ కొనసాగించాడు. ఈ వలలో పడిన సాయికృష్ణ ‘ఈ రాత్రికి డేటింగ్‌ చేద్దాం. రేపు పెళ్లి చేసుకుందాం’ అంటూ సమాచారం ఇచ్చి గురువారం రాత్రి సిటీకి చేరుకున్నాడు. ఎల్బీ నగర్‌ ప్రాంతంలో వల పన్నిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్‌కు చెందిన సాయికృష్ణగా గుర్తించారు. విజయ్‌ దేవరకొండకు యువతుల్లో ఉన్న క్రేజ్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని పథకం పన్నినట్లు, అందుకే యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు.

Also Read: ఆఫీసులోనే స్నానం చేసి రండి.. మంత్రికి ఆయన భార్య ఆదేశం

నిందితుడు ప్రస్తుతం మీర్జాపూర్‌లో ఇడ్లీ బండి నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ఇతనికి తండ్రి లేడు. తల్లి కూడా దివ్యాంగురాలు కావడంతో ఆమెకు ఇతడే ఆధారం. సాయిని నిందితుడి పరిగణిస్తూ సీఆర్పీసీ 41–ఏ నోటీసులు జారీ చేసిన పోలీసులు ఆ ఊరి నుంచి వచ్చిన పెద్దలకు శుక్రవారం అతడిని అప్పగించారు.

Must Read: కరోనా ఎఫెక్ట్: మంత్రి ఈటలకు రూ.8 కోట్లు నష్టం

Also Read: జనగామలో కరోనా కలకలం.. ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన యువకుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.