యాప్నగరం

వరదలో కొట్టుకుపోతున్న ఫ్యామిలీ.. ఏడాది బాలుడు కూడా.. కాపాడిన పోలీసులు..

Rajendra Nagar: వరద నీరు వేగంగా వస్తుండడంతో వారిని రక్షించడం చాలా కష్టమైందని పోలీసులు తెలిపారు. నీటిలో చిక్కుకున్నవారిలో ఒక సంవత్సరం బాబు కూడా ఉండడం గమనార్హం.

Samayam Telugu 16 Oct 2020, 3:17 pm
నగరంలో వరద నీటిలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని రక్షించేందుకు రాజేంద్రనగర్ పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. భారీ వర్షాలతో పలు కాలనీలు నీటిలో మునిగిన వేళ బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని మైపాల్ టౌన్ పక్కనున్న ఓ కుటుంబం మొత్తం వాగులో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ సీఐ సురేష్, ఎస్సై బాల్ రాజ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. నీటిలో చిక్కుకుపోయిన వారిని తాడు సహాయంతో బయటకు లాగారు.
Samayam Telugu ఏడాది బాలుడ్ని భుజాన వేసుకొని ఉన్న వ్యక్తిని కాపాడుతున్న పోలీసులు
rajendra nagar police


వరద నీరు వేగంగా వస్తుండడంతో వారిని రక్షించడం చాలా కష్టమైందని పోలీసులు తెలిపారు. నీటిలో చిక్కుకున్నవారిలో ఒక సంవత్సరం బాబు కూడా ఉండడం గమనార్హం. అలాగే, వాగు పక్కనే ఉన్న వారిని వాలంటీర్స్ సాయంతో సురక్షిత ప్రాంతానికి పంపించారు. పోలీసులు చేసిన ఈ సాహసానికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. హిమాయత్ సాగర్ గేట్‌లు తెరవడంతో నీరు పొంగిపొర్లుతుందని పోలీసులు తెలిపారు. కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.