Hyderabad Police Stops Riders In Janta Curfew And Punished Them
జనతా కర్ఫ్యూ: ఖాళీ రోడ్లపై రయ్ రయ్.. తిక్క కుదిర్చిన హైదరాబాద్ పోలీసులు
జనతా కర్ఫ్యూ అమలులో ఉన్నప్పుడు కూడా బాధ్యారాహిత్యంగా రోడ్లపై తిరిగే వారిపై హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చినందుకు గల సరైన కారణం చెప్పకుంటే వారికి ప్లకార్డు ఇచ్చి కూడళ్లలో ప్రదర్శింపజేశారు. వీరిలో ఎక్కువ మంది యువకులే ఉండడం విశేషం. పంజాగుట్ట వద్ద ప్రతి వాహనదారుడినీ ఆపిన పోలీసులు బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందన్న దానిపై వివరణ అడిగారు. సరైన ఆధారాలు లేదా కారణం ఉన్న వారిని వదిలేసి, సరదాగా వచ్చిన వారిని అక్కడే నిలబెట్టారు. కాసేపటికి వారికి ప్లకార్డులు ఇచ్చి ప్రదర్శించాలని ఆదేశించారు. పంజాగుట్ట, అమీర్పేట్, రసూల్పుర, ఎస్ఆర్ నగర్ వంటి ప్రాంతాల్లో వాహనదారులను నిలబెట్టి తమ బాధ్యతను గుర్తు చేశారు. ‘‘దయచేసి సామాజిక వ్యత్యాసం పాటించండి, పరిశుభ్రతను పాటించండి, భద్రత అనేది పరిశుభ్రత నుంచే మొదలవుతుంది, జనతా కర్ఫ్యూకు మద్దతు పలకండి, ఇంట్లోనే ఉండండి, సమూహాలుగా ఏర్పడకండి, అనారోగ్యంతో ఉంటే తప్ప బయటికి రాకండి’’ వంటి నినాదాలు ఉన్న ప్లకార్డులను వాహనాదులకు ఇచ్చి ప్రదర్శింపజేశారు.
Samayam Telugu23 Mar 2020, 2:13 pm
జనతా కర్ఫ్యూ అమలులో ఉన్నప్పుడు కూడా బాధ్యారాహిత్యంగా రోడ్లపై తిరిగే వారిపై హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చినందుకు గల సరైన కారణం చెప్పకుంటే వారికి ప్లకార్డు ఇచ్చి కూడళ్లలో ప్రదర్శింపజేశారు. వీరిలో ఎక్కువ మంది యువకులే ఉండడం విశేషం. పంజాగుట్ట వద్ద ప్రతి వాహనదారుడినీ ఆపిన పోలీసులు బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందన్న దానిపై వివరణ అడిగారు. సరైన ఆధారాలు లేదా కారణం ఉన్న వారిని వదిలేసి, సరదాగా వచ్చిన వారిని అక్కడే నిలబెట్టారు. కాసేపటికి వారికి ప్లకార్డులు ఇచ్చి ప్రదర్శించాలని ఆదేశించారు. పంజాగుట్ట, అమీర్పేట్, రసూల్పుర, ఎస్ఆర్ నగర్ వంటి ప్రాంతాల్లో వాహనదారులను నిలబెట్టి తమ బాధ్యతను గుర్తు చేశారు. ‘‘దయచేసి సామాజిక వ్యత్యాసం పాటించండి, పరిశుభ్రతను పాటించండి, భద్రత అనేది పరిశుభ్రత నుంచే మొదలవుతుంది, జనతా కర్ఫ్యూకు మద్దతు పలకండి, ఇంట్లోనే ఉండండి, సమూహాలుగా ఏర్పడకండి, అనారోగ్యంతో ఉంటే తప్ప బయటికి రాకండి’’ వంటి నినాదాలు ఉన్న ప్లకార్డులను వాహనాదులకు ఇచ్చి ప్రదర్శింపజేశారు.
నమస్కారంతో సిగ్గు పడ్డ వాహనదారులు
మరికొన్ని చోట్ల వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులంతా కలిసి వ్యంగ్యంగా నమస్కారం చేసి, వారి బాధ్యతను గుర్తు చేశారు. పోలీసుల తీరు చూసేందుకు మర్యాదపూర్వకంగానే ఉన్నా.. అందులో వెటకారం దాగి ఉండడంతో అది వాహనదారులకు చెంపపెట్టులా అనిపించింది. జనతా కర్ఫ్యూ సందర్భంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి, అంతా ఇంట్లోనే ఉండగా బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. పోలీసులు వారిని ఆపి దండం పెడుతుండడంతో వాహనదారులు తాము చేసిన పనికి తామే సిగ్గుపడ్డారు. వీటికి సంబంధించిన ఫోటోలను హైదరాబాద్ పోలీసులు ట్వీట్ కూడా చేశారు.
సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ హైటెక్ సిటీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్నేహితులు, బంధువులు బయట తిరుగుతున్నారని ఎవరూ బయటికి వెళ్లొద్దని సూచించారు. తర్వాతి 14 రోజులూ అత్యంత కీలకం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా ఉందని స్వయంగా సీఎం కేసీఆర్ దీన్ని పర్యవేక్షిస్తున్నట్లు గుర్తు చేశారు. మరోవైపు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కూడా ప్రజలు స్వచ్ఛందంగ కర్ఫ్యూ పాటిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో దాదాపు 99 శాతం మంది ఇంట్లోనే ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.