యాప్నగరం

సీఎం జగన్‌కు ధన్యవాదాలు: దిశ తండ్రి

AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్‌కు దిశ తండ్రి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ అసెంబ్లీ దిశ చట్టాన్ని ఆమోదించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Samayam Telugu 13 Dec 2019, 3:15 pm
పీ అసెంబ్లీ దిశ చట్టానికి ఆమోదం తెలపడం పట్ల దిశ తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకురావడం సంతోషం. సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతున్నా’ అని దిశ తండ్రి వ్యాఖ్యానించారు. దిశ ఘటన నేపథ్యంలో అత్యాచార ఘటనలను నియంత్రించడం, మహిళలు, చిన్నారులకు మరింత భద్రత కల్పించే ‘దిశ’గా వైఎస్ జగన్ ప్రభుత్వం దిశ చట్టాన్ని రూపొందించింది. శుక్రవారం (డిసెంబర్ 13) మధ్యాహ్నం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన వెంటనే సభ్యులందరూ తమ ఆమోదం తెలిపారు. ఆ వెంటనే బిల్లు ఆమోదం పొందినట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు.
Samayam Telugu cm Jagan


సీఎం జగన్.. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులకు మరోసారి అభినందనలు తెలిపారు. ఈ ఘటనలో తక్షణమే చర్య తీసుకున్నారని గుర్తు చేశారు. ఆడపిల్లల తండ్రిగా ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. విప్లవాత్మక చర్యలు తీసుకుంటేనే మార్పు సాధ్యమన్నారు.

నేరం చేస్తే ఎంతటివారినైనా వదలకూడదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దిశ లాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి.. అన్ని ఆధారాలుంటే 21 రోజుల్లో శిక్ష విధించడం దిశ చట్టం ముఖ్య ఉద్దేశం.

Also Read: మహిళల భద్రతపై ఏపీకి ఓ ‘దిశ’.. తెలంగాణకు ఎప్పుడు ఆ దశ!

అత్యాచార సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచుతున్నట్లు చట్టంలో పేర్కొన్నారు. కేంద్రం చేసిన ‘పోక్సో’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు కనీసం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ శిక్ష విధించవచ్చు. ఏపీలో ఈ శిక్షను జీవితఖైదుగా మార్చారు. అంటే పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలకు పాల్పడితే జీవితాంతం జైల్లో ఉంచటమో, లేక ఉరికంబం ఎక్కించడమో చేస్తారు.

సోషల్ మీడియాలో మహిళలపై పిచ్చి కూతలకూ చెక్..
సోషల్‌ మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. ఇకపై మెయిల్స్‌ ద్వారా గానీ, సోషల్‌ మీడియా ద్వారా గానీ, ఇతర ఏ విధమైన డిజిటల్‌ విధానంలోనైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే దిశ చట్టం ద్వారా మొదటి తప్పునకు 2 ఏళ్లు, ఆ తర్వాత తప్పునకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకొచ్చారు.

Also Read: హాజీపూర్ కిల్లర్‌కు ఉరి శిక్ష ఖాయమా.. విచారణ చివరి దశకు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.