యాప్నగరం

హైదరాబాద్‌లో క్రాస్ మసాజ్.. స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు

Hyderabad: వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు తన బృందంతో దాడి చేసి స్పా సెంటర్‌పై దాడి చేశారు. ఈ సెంటర్‌‌ను నిర్వహిస్తున్న యజమాని నాగేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Samayam Telugu 13 Nov 2020, 9:43 am
స్పా సెంటర్ పేరుతో అనైతిక కార్యకలాపాలు జరుపుతున్నారనే ఆరోపణలపై హైదరాబాద్‌లోని ఓ కేంద్రంపై సోదాలు జరిగాయి. గురువారం సాయంత్రం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సదరు స్పా సెంటర్‌పై దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎస్ ఆర్ నగర్‌‌లో సెలూన్‌, మసాజ్‌, స్పా సెంటర్‌ నడుస్తోంది. అయితే ఇందులో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
hyderabad task force police


ముఖ్యంగా మసాజ్ సెంటర్‌లో క్రాస్‌ మసాజ్‌ (మగవారికి ఆడవారు మసాజ్ చేయడం) జరుగుతోందని ఫిర్యాదు అందింది. వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు తన బృందంతో దాడి చేసి స్పా సెంటర్‌పై దాడి చేశారు. ఈ సెంటర్‌‌ను నిర్వహిస్తున్న యజమాని నాగేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక, స్పా సెంటర్లో ఉన్న ఇద్దరు యువతులను కూడా రక్షించారు. పట్టుబడ్డ వీరందరినీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు అప్పగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.