యాప్నగరం

రెచ్చిపోయిన గంజాయి రాకెట్ ముఠా.. 400 కిలోలు తరలిస్తూ..

హైదరాబాద్‌: పాతబస్తీ సంతోశ్ నగర్ పరిధిలో ఈ ముఠా పోలీసులకు పట్టుబడింది. అరెస్టు చేసిన ఆరుగురి నుంచి పోలీసులు రెండు కార్లను, 400 కిలోల గంజాయిని సీజ్ చేశారు.

Samayam Telugu 27 Dec 2019, 3:16 pm
హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల ముఠాలు యథేచ్ఛగా రెచ్చిపోతున్నాయి. గత కొన్ని రోజుల్లోనే గంజాయి, డ్రగ్స్ ముఠాలు పట్టుబడగా, మరోసారి భారీ గంజాయి తరలిస్తున్న వారిని పోలీసులు గుర్తించారు. కార్లలో దాదాపు 400 కిలోల గంజాయిని తరలిస్తుండడం గమనార్హం. ఇందుకు కారణమైన ఆరుగురు వ్యక్తులను పక్కా సమాచారంతో పోలీసులు అరెస్టు చేశారు.
Samayam Telugu Ganjai.


Also Read: పెట్రోలు పంపులో నుంచి నీళ్లు.. 50 వాహనాల్లో పెట్రోలుకు బదులు..

ఈ సరకును విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. 2 కార్లలో 400 కిలోల గంజాయిని తరలిస్తుండడం గమనార్హం. హైదరాబాద్‌లోని పాతబస్తీ సంతోశ్ నగర్ పరిధిలో ఈ ముఠా పోలీసులకు పట్టుబడింది. అరెస్టు చేసిన ఆరుగురి నుంచి పోలీసులు రెండు కార్లను, 400 కిలోల గంజాయిని సీజ్ చేశారు. విచారణ నిమిత్తం నిందితులను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చంద్రాయణ గుట్ట పోలీసులకు అప్పగించారు.

Also Read: తెలంగాణ తర్వాతి సీఎం ఆయనే.. కేసీఆర్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

మరో వారం రోజుల్లో న్యూ ఇయర్ రానున్న నేపథ్యంలో నగరంలో డ్రగ్స్ ముఠాలు చెలరేగుతున్నాయి. గురువారం కూడా కుషాయిగూడలో మాదకద్రవ్యాలు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 150 గ్రాముల బ్రౌన్‌ హెరాయిన్‌, 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి బంగారం, వెండి, యమహా బైక్, రూ.4 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.

Also Read: బిపిన్ రావత్‌ ఘాటు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఒవైసీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.