యాప్నగరం

Vikarabad Plane Crash: పత్తి చేనులో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు ట్రైనీ పైలెట్లు దుర్మరణం

Telangana Plane Crash: తెలంగాణలో శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ట్రైనీ పైలెట్లు ప్రాణాలు వదిలారు. హైదరాబాద్‌కు 100 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Samayam Telugu 6 Oct 2019, 4:11 pm
హైదరాబాద్ సమీపంలో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ట్రైనీ పైలెట్లు మృతి చెందారు. హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలో.. వికారాబాద్ జిల్లాలోని సుల్తాన్‌పూర్ గ్రామ సమీపంలో ఈ విమానం కూలిపోయింది. విమానం ప్రయాణిస్తున్న సమయంలో వికారాబాద్, పరిగి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పాటు పెద్ద ఎత్తున గాలి వీస్తున్న సమయంలో విమానం అటుగా వెళ్లింది. వాతావారణం అనుకూలంగా లేకపోవడంతో.. విమానం గాల్లో చక్కర్లు కొట్టింది.
Samayam Telugu plane accident


విమానాన్ని కంట్రోల్ చేయడానికి పైలట్ ప్రయత్నించారు. దాదాపు పది నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిందని స్థానికులు చెబుతున్నారు. కాగా విమానం గాల్లో ఉన్నప్పుడే దానిలో నుంచి పొగలు వచ్చాయని, ఒక్కసారిగా భూమిని ఢీ కొట్టిందని అధికారులు పేర్కొంటున్నారు.

విమాన ప్రమాదంలో మరణించిన వారిని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీకి చెందిన ట్రైనీ పైలెట్లు ప్రకాశ్ విశాల్, అమన్ ప్రీత్ కౌర్‌గా గుర్తించారు. ట్రైనింగ్‌లో భాగంగా వీరు బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం బయల్దేరి వెళ్లారు. గంట తర్వాత వీరు ప్రయాణిస్తున్న విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానం కూలిపోయిందని వికారాబాద్ పోలీసులు ఎయిర్‌పోర్ట్ అధికారులకు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న వికారాబాద్ పోలీసులు విమాన శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను తొలగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.