యాప్నగరం

‘మున్సిఫ్’ చీఫ్ ఎడిటర్ ఖాన్ లతీఫ్ ఖాన్ కన్నుమూత.. చికాగోలోనే అంత్యక్రియలు

Munsif Urdu Daily చీఫ్ ఎడిటర్ ఖాన్ లతీఫ్ ఖాన్ చికాగోలో మరణించారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు.

Samayam Telugu 7 Aug 2020, 11:36 am
మున్సిఫ్ ఉర్దూ దినపత్రిక చీఫ్ ఎడిటర్ ఖాన్ లతీఫ్ మహ్మద్ ఖాన్ (80) తుది శ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు (ఆగష్టు 7) చికాగోలో మరణించారు. వెటరన్ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డితో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. ఉర్దూ దినపత్రిక మున్సిఫ్‌ను 23 ఏళ్ల క్రితం ఖాన్ తిరిగి పబ్లిష్ చేశారు. సుల్తాన్ ఉల్ ఉలుమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్‌గా ఉన్న ఆయన నామమాత్ర ఫీజుకే పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు.
Samayam Telugu khan lateef khan


కొద్ది వారాల క్రితం వైద్య చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లారు. ఖాన్ పార్థీవ దేహాన్ని చికాగోలోని ముస్లిం కమ్యూనిటీ సెంటర్‌కు తరలిస్తారు. చికాగోలోనే ఆయన మృతదేహాన్ని ఖననం చేస్తారు. లతీఫ్ ఖాన్‌కు భార్య, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమారుడు అస్లాం మహ్మద్ ఖాన్ చికాగోలో ప్రముఖ వైద్యుడు.

లతీఫ్ ఖాన్ ఎస్టేట్స్ పేరిట ఆయన నిర్మించిన భారీ వాణిజ్య సముదాయం హైదరాబాద్ నగరంలో పేరొందింది. లతీఫ్ ఖాన్ మరణం పట్ల హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.