కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించినప్పటి నుంచి పోలీసులు నిరంతరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పోలీస్ శాఖలోనూ కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా పాజిటివ్తో హైదరాబాద్కు చెందిన ఓ కానిస్టేబుల్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరొకరికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. బాలాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా లక్షణాలు ఉండడంతో అతనికి ఆ పరీక్షలు చేశారు. నివేదికలో అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది.
ఈ లాక్ డౌన్ సమయంలో ఇక్కడే చిక్కుకుని పోయిన వలసకూలీల తరలింపు ప్రక్రియ కోసం డీఐ కొంతకాలంగా పనిచేస్తున్నారు. అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వెంటనే గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పని చేస్తున్నారు. దీంతో ఆ స్టేషన్లో పనిచేసే మిగతా సిబ్బంది మొత్తాన్ని కూడా హోమ్ క్వారంటైన్కు అధికారులు తరలించారు.
ఈ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సుధీర్ కృష్ణ హబ్సీగూడలో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులను, ప్రైమరీ కాంటాక్ట్లు ఉన్న వారిని కూడా వైద్యాధికారులు హోం క్వారంటైన్కు తరలించారు.
Also Read: undefined
ఈ లాక్ డౌన్ సమయంలో ఇక్కడే చిక్కుకుని పోయిన వలసకూలీల తరలింపు ప్రక్రియ కోసం డీఐ కొంతకాలంగా పనిచేస్తున్నారు. అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వెంటనే గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పని చేస్తున్నారు. దీంతో ఆ స్టేషన్లో పనిచేసే మిగతా సిబ్బంది మొత్తాన్ని కూడా హోమ్ క్వారంటైన్కు అధికారులు తరలించారు.
ఈ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సుధీర్ కృష్ణ హబ్సీగూడలో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులను, ప్రైమరీ కాంటాక్ట్లు ఉన్న వారిని కూడా వైద్యాధికారులు హోం క్వారంటైన్కు తరలించారు.
Also Read: undefined