యాప్నగరం

పోలీసు శాఖలో కరోనా కలకలం.. మరో ఇన్స్‌పెక్టర్‌కు కొవిడ్

Telangana Police: ఈ లాక్ డౌన్ సమయంలో ఇక్కడే చిక్కుకుని పోయిన వలసకూలీల తరలింపు ప్రక్రియ కోసం డీఐ కొంతకాలంగా పనిచేస్తున్నారు. అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వెంటనే గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

Samayam Telugu 22 May 2020, 3:37 pm
కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించినప్పటి నుంచి పోలీసులు నిరంతరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పోలీస్ శాఖలోనూ కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా పాజిటివ్‌తో హైదరాబాద్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరొకరికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. బాలాపూర్ డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా లక్షణాలు ఉండడంతో అతనికి ఆ పరీక్షలు చేశారు. నివేదికలో అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
TS Police


ఈ లాక్ డౌన్ సమయంలో ఇక్కడే చిక్కుకుని పోయిన వలసకూలీల తరలింపు ప్రక్రియ కోసం డీఐ కొంతకాలంగా పనిచేస్తున్నారు. అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వెంటనే గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ పని చేస్తున్నారు. దీంతో ఆ స్టేషన్లో పనిచేసే మిగతా సిబ్బంది మొత్తాన్ని కూడా హోమ్ క్వారంటైన్‌కు అధికారులు తరలించారు.

ఈ డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ సుధీర్ కృష్ణ హబ్సీగూడలో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులను, ప్రైమరీ కాంటాక్ట్‌లు ఉన్న వారిని కూడా వైద్యాధికారులు హోం క్వారంటైన్‌కు తరలించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.