యాప్నగరం

గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి దుర్మరణం

Hyderabad: మద్యం తాగుతూ కోడి గుడ్డు తిన్న ఓ వ్యక్తి గొంతులో గుడ్డు ఇరుక్కోవడంతో మృతి చెందిన విషాదమిది. హైదరాబాద్‌ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 30 Nov 2019, 4:56 pm
గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి దుర్మరణం పాలైన విషాద సంఘటన హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. మద్యం తాగుతూ కోడిగుడ్డును అమాంతం తినేయడం వల్ల అది గొంతులో ఇరుక్కొని ఊపిరాడకపోవడంతో బాధితుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. యాచారం మండలం గున్‌గల్గ్రామానికి చెందిన మచ్చ యాదయ్య (45) ఇబ్రహీంపట్నంలోని శ్రీరామ వైన్స్‌లో సహాయకుడిగా పని చేస్తున్నాడు.
Samayam Telugu గుడ్డు తిని వ్యక్తి దుర్మరణం


గురువారం (నవంబర్ 28) రాత్రి విధులు ముగిసిన తర్వాత యాదయ్య వైన్స్‌లోని పర్మిట్ రూమ్‌లో మద్యం సేవించాడు. మందు పెగ్ తీసుకున్న వెంటనే కోడి గుడ్డు తింటుండగా.. అది గొంతులో ఇరుక్కుని అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి సిబ్బంది అది గమనించి వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించారు.

Also Read: లారీలు అడ్డుపెట్టి గ్యాంగ్ రేప్.. వైద్యురాలి హత్య కేసు దారుణాలు

ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే యాదయ్య చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. యాదయ్యను పరీక్షించిన వైద్యులు గొంతులో గుడ్డు ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడకపోవడం వల్ల మృతి చెందాడని వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.