యాప్నగరం

‘ఇంటింటికి రూ.25 వేలు.. ట్రాఫిక్ చలాన్లు మేమే కడతాం’.. భాగ్యనగర వాసులకు బీజేపీ వరాలు

GHMC Electionsలో బీజేపీ మేయర్ పీఠాన్ని గెలుచుకుంటే వరదల కారణంగా నష్టపోయిన వారికి రూ.25 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.

Samayam Telugu 19 Nov 2020, 2:13 pm
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో తాడేపేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్న బీజేపీ.. హైదరాబాద్ నగరవాసులకు కీలక హామీలిచ్చింది. బీజేపీకి మేయర్ పీఠం దక్కితే.. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.25 వేల చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఏ ఇంటికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి.. కేంద్రం నుంచి నిధులు రప్పిస్తామన్నారు.
Samayam Telugu bandi
Telangana BJP president Bandi Sanjay Kumar. ( Twitter/@bandisanjay_bjp)


ఇళ్లు కూలిపోతే ఇళ్లు కట్టిస్తాం. బైక్‌లు పోతే బైక్‌లు కొనిస్తాం.. కార్లు పోతే కార్లు కొనిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. కేసీఆర్‌కు రూ.10 వేలు ఇచ్చే యోచన ఉంటే నేరుగా ఇవ్వొచ్చు కదా అని సంజయ్ సూచించారు. ఇప్పుడే అకౌంట్లలో డబ్బులేస్తే ఇబ్బందనే ఉద్దేశంతోనే కేసీఆర్ అలా చేయడం లేదన్నారు. వరద సాయం ఆపాలని తాను ఎన్నికల సంఘాన్ని కోరలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు పునరుద్ఘాటించారు. ఇది కేసీఆర్ కుట్ర అని ఆరోపించారు. కేసీఆర్ నిజంగా హిందువైతే.. చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడి దగ్గరకు రేపు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి ప్రమాణం చెప్పాలన్నారు.

‘‘చలాన్ల పేరిట ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బైక్ మీద ముగ్గురు యువకులు వెళ్తే చలాన్లు విధిస్తున్నారు. బీజేపీ జీహెచ్ఎంసీ మేయర్ పదవిని చేపట్టిన తర్వాత.. భాగ్యనగర పరిధిలో వసూలు చేసిన చలాన్లను మొత్తం మేమే కడతాం. చలాన్ల కారణంగా ఎక్కువగా యువకులే ఇబ్బంది పడుతున్నారు. ఓల్డ్ సిటీలో ఎన్ని చలాన్లు వసూలు చేస్తున్నారు..? అక్కడి వాళ్లే మనుషులు.. బయటి వాళ్లు కాదా..?’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో బీజేపీ గెలిస్తే.. ముఖ్యమంత్రి దిగొస్తాడు.. ఎల్‌ఆర్ఎస్‌ను రద్దు చేస్తాడని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

మీకు మందు పే చర్చ కావాలా..? ఛాయ్ పే చర్చ కావాలా..? ఆలోచించుకోవాలని ప్రజలను సంజయ్ కోరారు. కేసీఆర్ తాత పుట్టక ముందు నుంచే యాగాలు, పూజలు చేస్తున్నారంటూ.. టీఆర్ఎస్ అధినేతను బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులను పెంచి పోషించే హైదరాబాద్ కావాలా..? దేశభక్తులకు నిలయమైన హైదరాబాద్ కావాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.