యాప్నగరం

సీఎం కేసీఆర్‌కు ఇండియన్ నేవీ ధన్యవాదాలు

Pragathi Bhavan: కల్నల్ కుటుంబానికి సీఎం ఉదారంగా స్పెషల్ ప్యాకేజీ ప్రకటించడం పట్ల డిప్యూటీ వైస్ చీఫ్ అడ్మిరల్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ చేసిన సాయం ఇప్పటివరకు ఏ సైనికుడికీ జరగలేదని లేఖలో పేర్కొన్నారు.

Samayam Telugu 26 Jun 2020, 10:58 pm
భారత నావికాదళం డిప్యూటీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎం.ఎస్‌. పవార్‌ సీఎం కేసీఆర్‌‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన కేసీఆర్‌కు శుక్రవారం లేఖ రాశారు. గాల్వన్‌ లోయలో చైనా-భారత సైనికుల ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్‌ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబానికి సీఎం ఉదారంగా ఈ ప్యాకేజీ ప్రకటించడం పట్ల డిప్యూటీ వైస్ చీఫ్ అడ్మిరల్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ చేసిన సాయం ఇప్పటివరకు ఏ సైనికుడికీ జరగలేదని లేఖలో పేర్కొన్నారు.
Samayam Telugu కేసీఆర్
kcr


సీఎం కేసీఆర్‌ చేసిన సాయం ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా అనుసరించేలా విధంగా ఉందని కొనియాడారు. ‘‘పుట్టిన గడ్డను రక్షించడానికి భారత సైనికుల ఎన్నడూ వెనకడుగు వేయలేదు. అందుకు చరిత్రలో ఎన్నో సాక్షాలున్నాయి. అమరులైన ఎందరో సైనికుల పేర్లను జాతి గుర్తు పెట్టుకుంది. మీ చర్య ప్రతి ఒక్కరినీ కదిలించేలా, స్ఫూర్తి నింపేలా చేసింది. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడేలా ఆలోచింపజేసింది. దేశం కోసం తాము అమరులమైతే తమ కుటుంబానికి జాతి యావత్తు అండగా ఉంటుందనే నమ్మకమైన సందేశాన్నిచ్చింది’’ అని సీఎం కేసీఆర్‌‌ను ఎంఎస్‌ పవార్‌ కొనియాడారు.

Also Read: కరోనాతో హెడ్ నర్సు మృతి.. మరో 4 రోజుల్లోనే రిటైర్మెంట్

కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్‌ రూ.5 కోట్ల నగదు, బంజారాహిల్స్‌లో ఇంటి స్థలం అందజేసిన సంగతి తెలిసిందే. ఆయన భార్యకు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. మరోవైపు, సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేట పాత బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.