యాప్నగరం

వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. జారిపడి శిశువు మృతి

అప్పు డే పుట్టిన శిశువుని కిందపడేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శిశువు తలకు దెబ్బ తగిలి చనిపోయాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 2 Nov 2020, 2:25 pm
హైదరాబాద్ వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బాబు వైద్యం వికటించి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి జరిగింది.మీర్ పెట్ కి చెందిన ప్రసన్న(23) గత రెండు రోజుల క్రితం డెలివరీ కోసం వనస్థలిపురంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి వచ్చింది.
Samayam Telugu సిబ్బంది చేతుల నుంచి జారిపడి శిశువు మృతి

ఈరోజు డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి అప్పుడే పుట్టిన బాబుని చేతుల్లోకి తీసుకొని కింద పడేసారాని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందుకే తలకి దెబ్బ తగిలి చనిపోయాడని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం తెల్లవారుజామున ఆరు గంటలకు మగశిశువుకు జన్మనిచ్చింది ప్రసన్న. అయితే కాన్పు సమయంలో శిశువు ప్రమాదవశాత్తు సిబ్బంది చేతిలోనుంచి జారి కింద పడటంతో తలకు గాయమైంది. వెంటనే శిశువును చికిత్స నిమిత్తం నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు శిశువు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. అయితే ఈ విషయాన్ని చెప్పకుండా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాబు తల్లిదండ్రులు చెబుతున్నారు.
Read More: మరోసారి తెరపైకి దిశ నిందితుల కుటుంబాలు
బాబుకి బాగోలేదని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్ళని హాస్పటల్ సిబ్బంది సమాధానం చెబుతున్నారని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చేతుల్లోంచి బాబును కిందపడేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించాడని ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు సిబ్బంది చేతివాటం నడుస్తుందని బంధువుల చెబుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆస్పత్రి వద్ద నుంచి కదలమని చెబుతున్నారు శిశువు కుటుంబసభ్యులు. సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.