యాప్నగరం

బండి సంజయ్‌ను అనర్హుడిగా ప్రకటించాలి.. హైకోర్టు సీజేకు లేఖ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు పలువురు మేధావులు లేఖ రాశారు. బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆక్షేపిస్తూ ఆయనను ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ కోర్టును కోరారు.

Authored byRaj Kumar | Samayam Telugu 29 May 2022, 11:09 am
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పలువురు మేధావులు లేఖ రాశారు. హిందువులు, ముస్లింల మధ్య శాంతి సామరస్యాలకు భంగం కలిగిస్తూ పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్‌ను ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని వారు కోరారు. ఈ మేరకు 50 మంది మేధావులు, విద్యావంతులు, రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, జర్నలిస్టులు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాశారు. ఈ లేఖను సుమోటో పిటిషన్‌గా స్వీకరించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Samayam Telugu BandiSanjay High court


ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా సంజయ్‌ ర్యాలీలో మాట్లాడారు.. ‘జ్ఞానవాపిలోని మసీదులో తవ్వకాలు జరిపితే శివలింగం బయల్పడింది. దేశంలో ఏ మసీదు తవ్వినా.. హిందూ దేవాలయాల ఆనవాళ్లు బయటపడుతున్నాయి.. తెలంగాణలోనూ అన్ని మసీదుల్లో తవ్వకాలు జరపాలి. అక్కడ శివలింగాలు బయల్పడితే మాకు ఇచ్చేయాలి. శవాలు బయటపడితే మీరు (ముస్లింలు) తీసుకోండి..’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేధావులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే..
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.