యాప్నగరం

కరీంనగర్: ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య

Karimnagar పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని ఓ దుండగుడు ఆమె ఇంట్లోనే హత్య చేశాడు. అద్దెకు ఉంటున్న వ్యక్తి పనే అయుంటుందని అనుమానిస్తున్నారు.

Samayam Telugu 11 Feb 2020, 5:10 pm
రీంనగర్‌ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్‌ విద్యార్థినిని ఓ దుండగుడు గొంతు కోసి హత్య చేశాడు. బాలిక ఇంటివద్దే ఈ ఘోరం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులు రక్తపు మడుగులో తమ కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకుంటున్నారు. కరీంనగర్‌ పట్టణంలో విద్యానగర్‌లో సోమవారం (ఫిబ్రవరి 10) సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu suicide


మృతురాలు ముత్తా రాధిక (16) కరీంనగర్ పట్టణంలోని సహస్ర జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు వ్యవసాయం, రోజూ కూలీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో అద్దెకు ఉండే యువకుడే తమ కుమార్తెను కడతేర్చి ఉండవచ్చని రాధిక తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. విద్యానగర్‌లోని పద్మావతి ఫంక్షన్‌ హాల్‌ వెనుక భాగంలో ఉన్న రాధిక ఇంట్లో దుండగుడు ఆమెను హత్య చేశాడు. రాధిక ఒంటరిగా ఉన్న సమయం చూసి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. అదనపు డీసీపీ చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో పోలీసల బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి దుండగుడి కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read: కరోనా వైరస్: తెలంగాణకు కేంద్ర హైఅలర్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.